జనసేన పార్టీ తరఫున ఇటీవల అమెరికాలో జనసేన ప్రవాసాంధ్రులతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఎవరితో పొత్తులు పెట్టుకుని ఉందో వంటి విషయాలను తెలియజేసి జనసేన కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు.

Image may contain: 1 person

అమెరికాలో పర్యటనలో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో కానీ మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలో గాని కలిసే ప్రసక్తి లేదని కుదిరితే కేవలం వామపక్ష పార్టీలతో కలిసి పని చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Image may contain: 1 person, standing

ముఖ్యంగా బిజెపి గురించి మాట్లాడుతూ విభజనతో నష్టపోయి కష్టాలు పాలయిన ఆంధ్ర రాష్ట్రానికి హోదా ఇస్తామని మోసం చేశారు, చెప్పిన మాట నిలబెట్టుకుని ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.  వాళ్లకు బలం పూర్తిగా పోయింది. ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరు.

Image may contain: 1 person

వారితో కావడమంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే, వారితో కలిసి పనిచేయం. ఒంటరిగానే బరిలోకి దిగాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. మొత్తం మీద మొన్నటివరకు జనసేన పార్టీ ఆ పార్టీతో కలిసి పని చేస్తుంది పార్టీతో కలిసి పనిచేస్తుంది అని రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక కామెంట్లు వస్తున్న క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీతో సంతోషం లో ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: