ఓక ఇంటర్వ్యూ లో లక్ష్మీ పార్వతి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని నిజాలను షేర్ చేసుకున్నది . తాజాగా లక్ష్మి పార్వతి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో ఆమె వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టించేలా ఉన్నాయి. బాబు నుండి లోకేష్ వరకూ దాదాపు అన్ని టాపిక్కులు మాట్లాడిన ఆమె జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు.
యాంకర్ ఆమెను "జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారి సీనియర్ ఎన్టీఅర్ గారు పిలిపించి మాట్లాడారని అన్నారు. ఆ సమయంలో మీరు కూడా ఉన్నారని చెప్పారు" దాని గురించి చెప్తారా అని అడిగితే "అసలు వారిని పిలిపించింది నేనే. మా పెళ్ళయ్యాక ఆ అబ్బాయి ని వాళ్ళ అమ్మను పిలిపించింది నేనే. వాడు నా ఫోటో చించి అవతల పడేశాడు".. (ఎమోషనల్ అవుతూ ఇలా కంటిన్యూ చేశారు) "వాడూ ఏం తక్కువ కాదు కదా.. మినహాయింపేమీ కాదు." అన్నారు.
మరో సందర్భంలో "ప్రతి రోజు ఉదయాన్నే షాలిని(ఎన్టీఆర్ అమ్మగారు) ఫోన్ చేసేది. అత్తయ్య గారూ అది కావాలండీ.. అత్తయ్యగారు ఇది కావాలండి అంటూ రోజూ ఫోనులే" అంటూ అప్పటి విషయాలని పంచుకుంది. లోకేష్ గురించి అడిగితే "అయన తెలుగు భాష మాట్లాడతాడా లేదా అనేది తెలియడం లేదు. 10 లక్షలు ఖర్చుబెట్టి ట్యూషన్ మాస్టర్ ని పెట్టి తెలుగు నేర్పిస్తే కూడా ఇంకా తెలుగురాలేదు. అలా అని ఇంగ్లీష్ వచ్చా అంటే.. అది కూడా రాదు. ఏ భాషా రాని అయోమయంలో పెరిగిన ఓ వ్యక్తిని బలవంతంగా ప్రజల మీద రుద్దితే మంత్రి అవుతాడా?" అని ప్రశ్నించింది.