ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు కాస్త బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. పాపం.. తెలంగాణ ఎన్నికల్లో ఎంత చాణక్యం చేసినా.. పకడ్బందీగా ప్లాన్ చేసినా.. ఆయన ప్రచారం వీసమెత్తు ప్రభావం కూడా చూపించలేకపోయింది. తెలంగాణలో కేసీఆర్ మెడలు వంచి.. డిల్లీలో పరపతి అమాంతం పెంచుకుందామన‌్న ఆయన ప్లాన్ వర్కవుట్ కాలేదు.



తెలంగాణలో మొత్తం 12 చోట్ల బరిలో దిగితే టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే సాధించడం పాపం చంద్రబాబుకు గట్టి దెబ్బే. దీనికి తోడు వరుసగా రెండోసారి.. అదీ బంపర్ మెజారిటీ గెలవడంతో కేసీఆర్ చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇప్పుడు వీటికి తోడు మరో దిమ్మతిరిగే దెబ్బ తగలబోతోందట. ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

Image result for gvl narasimha rao


తెలంగాణ ఎన్నికలలో రాహుల్, చంద్రబాబు కలిసి ప్రచారం చేశారని... జనం ఇద్దరికీ గుణ పాఠం చెప్పారని జీవీఎల్ అంటున్నారు. తెలంగాణ ఓటరు వీరిద్దరికీ దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు. చంద్రబాబుకు త్వరలోనే మరో దిమ్మదిరిగే దెబ్బ కూడా తగులుతుందని జోస్యం చెబుతున్నారు. రాఫెల్ డీల్ పై రాహుల్ గాంధీతో కలసి చంద్రబాబు కూడా తప్పుడు ప్రచారం చేశారని జీవీఆర్ మండిపడుతున్నారు.

Related image

ఇంతకీ జీవీఎల్ చెబుతున్న దిమ్మతిరిగే దెబ్బ ఏమై ఉంటుంది.. ఇప్పటికే టీడీపీ నేతల కంపెనీలు, సంస్థలపై ఈడీ, ఐటీ దాడులు జోరుగా సాగుతూనే ఉన్నాయి. వాటితో చంద్రబాబును కొత్తగా ఇరుకున పెట్టేదేముంది.. నేరుగా ఈసారి చంద్రబాబు ఆస్తులపైనే దాడి చేస్తారా.. చేసినా ఆ మాత్రం చంద్రబాబు అప్రమత్తంగా ఉండకపోతారా.. మరి ఆ దిమ్మ తిరిగే దెబ్బ ఏమై ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: