ఏపీ సీఎం చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందటఅతడిని నమ్మి గతంలో ఎన్టీఆర్ దారుణంగా మోసపోతే.. ఇప్పుడు బంధులు కూడా బాబు కారణంగా పరువు పోగొట్టుకుంటున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు..ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీ పార్వతి.

Image result for nandamuri suhasini


కూకట్ పల్లి స్థానంలో టీడీపీ పోటీ చేస్తే ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తెలిసి.. తెలిసి.. చంద్రబాబు కావాలనే కూకట్ పల్లి స్థానాని నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి ఇచ్చారని లక్ష్మీ పార్వతి అంటున్నారు. చంద్రబాబు ఎన్నికల జిత్తుల కారణంగా నందమూరి కుటుంబం మరోసారి పరువు పోగొట్టుకుందని ఆమె అంటున్నారు.

Related image


రేపు ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబును జనం చీకొట్టడం ఖాయమని ఆమె ధీమాగా చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో భారీగా దోపిడీ జరగుతోందని.. రాజధాని, నీటి ప్రాజెక్టులలో అవినీతి ఏరులై పారుతోందని లక్ష్మీపార్వతి ఆరోపిస్తున్నారు. ఏపీ సర్కారులో జరుగుతున్న అవినీతి చంద్రబాబు కింద పని చేసి రిటైరైన అధికారులు రాస్తున్న పుస్తకాలే నిదర్శనమని ఆమె చెప్పుకొచ్చారు.

Image result for nandamuri suhasini


వాస్తవానికి నందమూరి కుటుంబాన్ని అనూహ్యంగానే కూకట్ పల్లి రాజకీయాల్లోకి దింపారు చంద్రబాబు. టికెట్ కేటాయింపుల విషయంలో హఠాత్తుగా సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. చంద్రబాబు నిర్ణయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు అంత సుముఖంగా లేకపోయినా వ్యతిరేకించడం ఇష్టం లేక ఊరుకొండిపోయారు. అందుకే ఆయన ప్రచారానికి కూడా రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: