ఏపీ సీఎం చంద్రబాబుపై గులాబీ బాస్ మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు తనకు తాను ప్రపంచ నాయకుడు అని అనుకుంటాడని.. కానీ తాము అలా అనుకోవడం లేదని కామెంట్ చేశారు. ఇంతకీ ఈ కామెంట్ చేసిన గులాబీ బాస్ కేసీఆర్ కాదు.. కొత్త బాస్ కేటీఆర్. తమ దృష్టిలో చంద్రబాబు ఓ గల్లీ లీడర్ అని తీసిపారేశారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.



40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును అంత మాట అనడానికి కూడా కేటీఆర్ ఓ రీజన్ చెబుతున్నాడు. ఎందుకంటే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించడానకి చంద్రబాబు, రాహుల్ కలిసి హైదరాబాద్ లోని వివిధ నియోజకవర్గాలలో గల్లీ గల్లీ తిరగారన్నారు. ఇంత కష్టపడినా ప్రజలు పూర్తిగా తిరస్కరించారని టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కేటీఆర్ అన్నారు.

Image result for KTR VS CHANDRABABU


కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరీలింగంపల్లి వంటి చోట్ల టీఆర్ఎస్ కంటే ఎక్కువగా ప్రజాకూటమి తరపున చంద్రబాబు ఎక్కువ సభలు పెట్టారని కేటీఆర్ అంటున్నారు. అసలు వారికి అంత సమయం ఎక్కడ నుంచి వచ్చిందోనని కేటీఆర్ సెటైర్లు పేల్చారు. ఇంత చేసినా గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారని హేళన చేశారు కేటీఆర్.

Related image


ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. ఏపీలో ప్రాంతీయ శక్తి రావాలని తమ నాయకుడు కేసీఆర్, తాను బలంగా కోరుకుంటున్నామని కేటీఆర్ తెలివిగా సమాధానం చెప్పారు. ఆ ప్రాంతీయ శక్తి ఏంటనేది ఆ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: