సమర్ధవంతమైన పాలన, పటిష్ట సమాజంతో నెలకొని ఉన్నప్పుడు రాజ్యలో చిన్న దొంగలకే కాదు, బందిపోట్లకు, దేశద్రోహులకు ఊపిరాడక అన్నీ కలసి అన్ని వైపుల నుండి ముకుమ్మడిగా దాడి చేయటం అరాచకశక్తులను మేల్కొలపటం నైజం......ఇది చాణక్యుడు చెప్పిన నీతి.
సమర్ధ పాలకులకు అది తప్పదు. దాని అధారంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీకి జాతీయ భద్రత, రక్షణరంగాలు ఆటవస్తువులుగా లేదా డబ్బులు సంపాదించే వనరుగామారాయని విమర్శించారు. రఫేల్ ఒప్పందం విషయంలో కాగ్ నివేదికకు సంబంధించి ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో ఎదురు దాడి చేశారు.
- 10 అతి పెద్ద కుంభకోణాల్లో ఇరుక్కొని నేడు రాఫెల్ కుంభకోణం పేరుతో అభాంఢాలు వెసే కాంగ్రెస్ నుండి బిజెపికి వ్యతిరేఖంగా ప్రతిపక్షాల పేరుతో ఐఖ్యమయ్యే రాజకీయ పక్షాలకు లేదా వ్యక్తులకు అంతో ఇంతో వాటావుంది అంటున్నారు విశ్లేషకులు.
రాహుల్ గాంధి కుటుంబం, మిత్రులే భారత్ లో తొలి స్కాం స్పూర్తి ప్రధాతలు
2019 లోక్సభ ఎన్నికలకోసం దేశవ్యాప్తంగా భాజపా కార్యకర్తలతో మాట్లాడే కార్యక్రమంలో భాగంగా శనివారం తమిళనాడుకు చెందిన పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్-ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. 1940-50 లలో వి.కే. కృష్ణ మీనన్ జీపు కుంభకోణం మొదలు మొదలు బోఫోర్స్ కుంభకోణం, అగస్టా వెస్ట్ల్యాండ్, జలాంతర్గామి కుంభ కోణాల వంటి వాటి వరకు రక్షణ రంగాన్ని లూటీ చేశారని ఆరోపించారు.
అటువంటి వారే ఇప్పుడు మెరుపుదాడుల్ని హేళన చేస్తున్నారని విమర్శించారు. మన భద్రత బలగాల నైతిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉన్నా సరే వాటిని డబ్బులు పిండుకొనే మార్గాలు గానే చూస్తారని ఆరోపించారు. మన భద్రతా దళాల్ని చూసి మేం గర్విస్తామని, వారిపై పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. మనదేశానికి హాని తలపెట్టే వారితో తగిన విధంగా వ్యవహరించే స్వేచ్ఛను ప్రభుత్వం సైన్యానికి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల హింస తగ్గు ముఖం పడుతోందని, మావోయిస్టు లు వారి సానుభూతి పరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో తాము ప్రజలకు పూర్తిస్థాయిలో చేరువయ్యామని, సైన్యం ఉగ్రవాదంపై భారీస్థాయిలో విరుచుకు పడిందని, రికార్డు స్థాయిలో ఉగ్రవాదుల్ని ఏరేసిందని తెలిపారు.
కేంద్ర సంక్షేమపథకాలపై అవగాహన కల్పించడం భాజపా కార్యకర్తల బాధ్యత అని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఆ పథకాల్లో మరింతమంది ప్రజల్ని చేర్చాలని అభివృద్ధిపథంలో ఇతోదికంగా ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. "అందరి కోసం అందరి అభివృద్ధి భావన" ను భాజపా విశ్వసిస్తుందని పేర్కొన్నారు. తమిళ నాడు కు కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ చేయనంతగా భాజపా చేసిందన్నారు.
జాతీయ భద్రత, రక్షణ రంగం అనేవి కాంగ్రెస్ కు పంచింగ్ బ్యాగ్ వంటివని, దానికి ఆదాయాన్ని ఆర్జించే కామధేనువులని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. మన సైనిక దళాల నైతిక స్థైర్యం దెబ్బతింటున్నా సరే! డబ్బులు ఎలా? పిండుకోవాలనే వాళ్లు ఆలోచిస్తుంటారని ధ్వజమెత్తారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడులోని బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు.
"కాంగ్రెస్ నాయకులు ఒకవైపు సర్జికల్ స్ట్రైక్స్ను ఎద్దేవా చేస్తారు. మరోవైపు, 1940 - 50 ల్లో జీపుల కుంభకోణం నుంచి 1980 ల్లో బోఫోర్స్, మొన్నటి అగస్టా వెస్ట్ల్యాండ్, సబ్-మెరైన్ స్కాం వరకూ ఎన్నో కుంభకోణాల్లో రక్షణ రంగాన్ని వాళ్లు లూటీ చేశారు. మన బలగాల నైతిక స్థైర్యం దెబ్బతింటున్నా, దేశ ఆర్ధికా వ్యవస్థ నుండి స్వప్రయోజనాలకు డబ్బు పిండుకోవటం ఎలా? అన్న అంశంపైనే వాళ్ల కన్ను ఉంటుంది" అని విమర్శించారు.
భారత్ లో ప్రతిపక్షం నాయకత్వంలో నేడు ప్రభుత్వానికి వ్యతిరేక్షంగా కూటమి కడుతున్నవారిలో అందరు లేదా కొందరి ప్రమేయంతో అజేయంగా జరిగిన కుంభకోణాల చిట్టా ఈ లింకులో చూడొచ్చు
http://www.indianmirror.com/indian-industries/indian-scams/scamhome.html