కేటీఆర్ ఎన్నికల్లో గెలిచిన అనందం లో ఒకే సారి ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడినాడు . అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా జాతీయ స్ధాయిలో కీలక పాత్ర కూడా పోషిస్తుందని కల్వకుంట్ల తారక రామారావు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షుడైన తర్వాత తారక రామారావు మీట్ ది ప్రెస్ లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

Image result for ktr

జాతీయ స్ధాయిలో తెలుగుదేశం పార్టీ కీలక భూమి పోషిస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని అది జరగని పని అని చెప్పారు. " జాతీయ రాజకీయాలు - పునరేకికరణ వంటివి తర్వాత. ముందు తెలుగుదేశం పార్టీని రక్షించుకోండి" అని తారక రామారావు హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్పదేశ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి చాలా కీలకమైన భూమిక పోషించబోతోందని - అది ఏ రూపంలో ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

Image result for jagan

ఆంధ్రప్రదేశ్ లో చాలా శక్తివంతమైన రాజకీయ పార్టీకి తాము అండగా ఉంటామని మాత్రం చెప్పారు. "ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి ఏది మంచిదో నిర్ణయించు కోగలరు. అయితే మేం కూడా ఏది మంచిదో వారికి సూచిస్తాం" అని తారక రామారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తాము వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని - వారు ఇక్కడ పోటీ చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు కల్వకుంట్ల తారక రామారావు.

మరింత సమాచారం తెలుసుకోండి: