తెలంగాణ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రజా కూటమి గెలుస్తుంది లేకపోతే నేను అది చేస్తే ఇది చేస్తా సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో మీడియా ముందు కెమెరా ముందు మెడకాయ కోసుకుంటా అంటూ తెగ ఊదరకొట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Image result for bandla ganesh

దీంతో ఎవరైతే ఆయనను ఇంటర్వ్యూ చేశారో ఆయన ఇంటి ముందుకు బ్లేడ్ పట్టుకుని వెళ్లారు విలేకరి. అయితే ఆయన మాత్రం ఇంటిలో లేరు ఎక్కడ కూడా కనబడలేదు. ఈ క్రమంలో తాజాగా ఇటీవల తిరుమల తిరుపతి లో ప్రత్యక్షమయ్యారు బండ్ల గణేష్. తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేష్ తాను బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ స్పందించారు.

Image result for bandla ganesh

తొలుత తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ స్వామివారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. తాను అజ్ఞాతంలో ఉన్నానంటూ ఛానల్స్ లో ప్రచారం జరుగుతోందనీ, తాను ఎలాంటి అజ్ఞాతంలో లేనని స్పష్టం చేశారు.

Image result for bandla ganesh

తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో కొంచెం బాధతో ఉన్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారనీ, టీఆర్ఎస్ ను నమ్మారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్బంగా ఆవేశంతో లక్ష అంటామని, అవన్నీ చేయమని కోరితే ఎలా అంటూ విలేఖరులను ప్రశ్నించాడు. దీంతో బండ్ల గణేష్ సమాధానం విన్న విలేకరులు షాక్ అయిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: