ఏపీలో అధికారంలో ఉన్న నేతలు కేంద్రంపై వరుసపెట్టి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం సరిగ్గా నిధులు ఇవ్వడం లేదని అంటున్న టీడీపీ నేతల కామెంట్లను ఖండించారు.

Image result for chandrababu

కేంద్రం భారీ స్థాయిలో ఏపీకి నిధులు విడుదల చేసిందని ఆ విషయాన్ని టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని నరసింహా రావు ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెడుతూ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి ఇళ్ల పథకంలో ఎంతో దక్కిందని, ఈ నిజాన్ని ప్రజలకు చెబితే, చంద్రబాబునాయుడు అబద్ధాల రాయుడని తేలిపోతుందని అన్నారు.

Image result for chandrababu gvl

"ఆంధ్రప్రదేశ్ కు 'నరేంద్ర మోదీ పట్టణ ఇళ్ల పథకం'లో (పీఎంఏవై - అర్బన్) అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 9.6 లక్షల ఇళ్లు, రూ. 14,530 కోట్ల నిధులు కేంద్రం ఇచింది.

Related image

దేశంలో ఆరో భాగం కేవలం ఆంధ్రాకే. ఈ నిజాలాన్ని ప్రజలకు ప్రధాన మంత్రి చెప్తే చంద్రబాబు నాయుడు అబద్ధాల రాయుడు అని తెలియదా?" అని వ్యాఖ్యానించారు.  అంతే కాకుండా ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇల్లు మంజూరు చేసిందో కూడా ఇదే ట్వీట్ లో పేర్కొన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు.



మరింత సమాచారం తెలుసుకోండి: