లక్ష్మీ పార్వతీ విజయవాడ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్ర బాబు మీద లోకేష్ మీద విమర్శలు కురిపించింది. తెలంగాణ ఎన్నికల్లో అమాయకురాలైన సుహాసినిని బలిపశువుని చేశారని, బాలకృష్ణను పిచ్చోడిని చేసి ఆడిస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. "నందమూరి సుహాసినికి చంద్రబాబు చేసిన అన్యాయం అంతా చూశాం. ఆమె అమాయకురాలు. నందమూరి కుటుంబానికి మేలు చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే హరికృష్ణకు న్యాయం చేసేవారు.

Image result for lakshmi parvathi

బాలకృష్ణకు కూడా ఎమ్మెల్యే పదవి వచ్చేది కాదు. బాలకృష్ణ కూతుర్ని కోడలిగా చేసుకున్నాడు కాబట్టి, ఆ పిచ్చోడికి ఏదో ఎమ్మెల్యే పదవి ఇచ్చేసి పోయి సినిమాలు చేసుకోమన్నాడు. పాపం బాలకృష్ణ అమాయకుడు కాబట్టి, గెంతుకుంటూ పోయి సినిమాలు చేసుకుంటున్నాడు."  మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కావాలనే కట్ చేశారని, లోకేష్ కు పోటీగా వస్తాడనే భయంతోనే జూనియర్ ను ఆదిలోనే రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎప్పటికైనా నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మగాడు అన్నారామె. 

Image result for lakshmi parvathi and ntr

"లోకేష్ కు అడ్డు పడతాడనే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురాలేదు. ఆ కుటుంబంలో తెలివైన వాడు, చాతుర్యం ఉన్నవాడు, తాతగారి పోలికలు ఉన్నవాడు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అతడ్ని తీసుకొచ్చి పార్టీలో యువనాయకుడి పోస్ట్ ఇవ్వొచ్చు కదా. కానీ ఇవ్వలేదు. ఒకవేళ ఎన్టీఆర్ ను తీసుకొస్తే వెంటనే లోకేష్-ఎన్టీఆర్ మధ్య కంపారిజన్ వస్తుంది. ప్రజలకు లోకేష్ జ్ఞానం ఏపాటిదో తెలిసిపోతుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ వద్దు. అని విమర్శలు గుప్పించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: