ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకున్న పలు సంఘటనలతో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ వెండి తెరపైకి తెస్తున్న జీవన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్" ...‘అసలు కథ’ అనేది ట్యాగ్-లైన్ తో రూపొందుతూంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాట "వెన్నుపోటు" పేరుతో రామ్గోపాల్ వర్మ నేడు (శుక్రవారం) విడుదల చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న మహానటుడు నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి పదవీచ్యుడను చేసి దించేశారంటూ.. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న ఆనాటి అనేకుల ఫోటోలను చూపిస్తూ బ్యాగ్రౌండ్ లో పాట వినిపిస్తూ సగుతుందీ గేయగీతిక. సిరాశ్రీ సాహిత్యం కళ్యాణి మాలిక్ సంగీతంతో పాటు గానం చేయటం జరిగింది.
ఈ పాటను చూస్తుంటే మరో రాజకీయ వివాదానికి తెర తీసేలా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు వర్గం ఈ పాటను వ్యతిరేకించే అవకాశం ఉంది.
నిజంగా చెప్పాలంటే నందమూరి పతనం చూసిన అయితే నాటి తరంవారి హృదయాలు ద్రవించటం వారి మనో ఫలకాలపై గతం గిర్రున తిరగటం ఖాయం.