తెలంగాణ ఎన్నికల జరిగిన తర్వాత రాజకీయాల్లో కొత్త ట్విస్టులు నెలకొంటున్నాయి. టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో టి కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అనుకోని పరిణామాలతో ఎన్నికల్లో అతిరథ మహారథులు సైతం దారుణంగా ఓడిపోయారు. మొదటి నుంచి దూకుడు మీద ఉంటున్న టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. తెలంగాణకు సీఎం గా రెండోసారి కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీవైపు కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చూపు పడిందని..త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆకుల లలిత, సంతోష్ లు టీఆర్ఎస్ అథినేతను కలవడం కలవరం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే..తెలంగాణ ఎమ్మెల్సీ కొండా మురళి తన రాజీనామాను సమర్పించారు. భార్య సురేఖతో కలిసి ఈ రోజు ఉదయం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఛాంబర్ కు చేరుకున్న మురళి తన రాజీనామాను ఆయనకు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను తెలంగాణ శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యానని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దురహంకారపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకున్నారనీ, పార్టీని విలీనం చేసుకున్నారని ఆరోపించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇస్తామని టీఆర్ఎస్ బెదిరించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ తరఫున మండలికి ఎన్నికయినందున విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు టీఆర్ఎస్ లో చేరేవారిని మొదట ఇంటికి పిలిచి భోజనం పెడతారనీ, ఆ తర్వాత మాత్రం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో కాంగ్రెస్ నేతలు ఎవరైరా టీఆర్ఎస్ లోకి వెళ్లాలంటే..మనసు చంపుకోని వెళ్లాల్సిందే..అంటూ వ్యాఖ్యానించారు.