తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య జరిగింది. ప్రణయ్ దారుణ హత్య తర్వాత అలాంటివి వరుసగా మరికొన్ని ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణం జరిగింది. కులం రక్కసికి మరో ప్రేమ జీవి బలైపోయింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఈ దారుణం జరిగింది.


కలమడుగు గ్రామానికి చెందిన పిండి అనురాధ అనే అమ్మాయి.. అదే గ్రామానికి చెందిన అయ్యోరు లక్ష్మణ్‌ను ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు అయినా ఇంట్లో ఒప్పించవచ్చని ప్రేమికులు అనుకున్నారు. కానీ పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోగా.. ఆంక్షలు పెట్టారు.

Related image


దీంతో అనురాధ, లక్ష్మణ్‌ డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అక్కడ ఈనెల 3 న ఆర్యసమాజ్‌ ద్వారా పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కాస్త సానుకూలంగా ఉండటంతో 20 రోజుల తర్వాత కొత్త దంపతులిద్దరూ శనివారం సొంత ఊరికి వచ్చారు. లక్ష్మణ్, అనురాధ గ్రామానికి వచ్చారని తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు.


అబ్బాయి ఇంట్లోవారిని కొట్టి.. అమ్మాయిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. అదే ఆవేశంతో తమ పరువు తీసిందన్న కోపంతో అమ్మాయిని చంపేశారు. కూతురుని హత్య చేసి.. ఆ తర్వాత శవాన్ని నిలువునా బూడిద చేసి.. ఆ బూడిదను పక్కనే ఉన్న వాగులో కలిపేశారు. అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అనురాధను తల్లిదండ్రులే హత్య చేసిన విషయం వెలుగుచూసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: