మళ్లీ అధికారంలోకి రావాలి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించాలి. ఇదీ.. ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యం. మరి ఆయన ఆదిశగా చాలానే కృషి చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు ఏం చేస్తున్నారు? అనే విషయా న్ని పరిశీలించినప్పుడు మాత్రం చాలా చిత్ర విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకపక్క, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్ర మాలపై నాయకులకే అవగాహన లేని పరిస్థితి నెలకొంటోంది. ఇక, చంద్రబాబు మొత్తుకుంటున్నా కూడా పార్టీ సభ్యత్వ నమోదును కూడా నాయకులు లైట్గానే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పైకి మాత్రం టీడీపీ బాగానే ఉందని అనిపిస్తున్నా... క్షేత్రస్తాయిలో మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది.
గుంటూరు జిల్లా రాజధానికి పక్కనే ఉన్న వెస్ట్ నియోజకవర్గంలో పార్టీలో సమన్వయం కనిపించడం లేదు. గుంటూరు వె స్ట్ ఎమ్మెల్యే వేణుగోపాల రెడ్డి పార్టీలో అందుబాటులో కూడా ఉండడం లేదు. పైగా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చే స్తూ... పార్టీని బలహీన పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తూ ఓ కీలక నేత తనయుడు ఏకంగా వసూళ్లను మరింత వేగంగా పెంచాడని అంటున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్, ప్రతి కాంట్రాక్టరు నుంచి వసూళ్లు మామూలే.. అనే విధంగా ఇక్కడ ఆయన పరిస్థితి మారిపోయింది. ఈయనకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ కూడా ఇవ్వాలట! మరి ఈ నేపథ్యంలో టికెట్ కోరుకునే నాయకులు.. ఆదిశగా పార్టీని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు.
ఇక, తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. ఆయన ప్రజల్లోకి వెళ్లాలా ? వద్దా? వెళ్తే ఏమవుతుందో? వెళ్లపోతే.. ఏమవుతుందో ? అంటూ ఇంటి వద్దే కాలక్షేపం చేసుకుంటున్నారు. దీంతో పార్టీకి సంబంధించి పథకాలు, కార్యక్రమాలు సైతం ప్రజల్లోకి వెళ్లని పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారో లేదో ననే తీవ్ర ఆందోళనతో ఈయన అసలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇక్కడ కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంతంత మాత్రంగానే నమోదు అవుతోంది. ఇక, మాచర్లలో వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దీటుగా ఎదుగుతున్న టీడీపీ నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. దీంతో రాజధాని రాజకీయం చంద్రబాబు కు పొగపెడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.