ప్రస్తుతం ఏపీ లో తెలుగుదేశం పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని మనకందరికీ తెలిసిన విషయమే. ఇదే క్రమంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఆశీస్సులు కోసమో మరియు పార్టీ టికెట్ కోసమో తెలియదుగానీ ఆ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి చేసిన సర్వే పై సోషల్ మీడియాలో సెటైర్లు...కామెంట్లు తెగ పడుతున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే ఏపీ మంత్రి టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపు టీడీపీదే అని, ఈసారి ఇంకా గట్టిగా కొడతామని.. 175 సీట్లలో 150 సీట్లు గెలుస్తామని జ్యోస్యం చెప్పారు మంత్రి పత్తిపాటి పుల్లారావు.
దీంతో సోషల్ మీడియాలో మంత్రి పుల్లారావును ఆడేసుకుంటున్నారు. పత్తిపాటి పుల్లారావు, చంద్రబాబుకు నిజమైన తమ్ముడని, గత నాలుగేళ్ళగా టీడీపీ హయాంలో రాష్ట్రం అవినీతికి గురైందని, అధికార దుర్వినియోగంతో చేస్తున్న దోపిడీ వల్ల టీడీపీ పై వ్యతిరేకత ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో ఉందని జాతీయ మీడియా సైతం చెబుతోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లు సీట్లు ఎలా వస్తాయో చెప్పగలవా అంటూ మంత్రి పై ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాకుండా టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే వచ్చిన సీట్ల లేకపోతే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వచ్చిన సీట్ల అని ప్రశ్నలు వేస్తున్నారు.