తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎన్టీఆర్ భయం పట్టుకుంది. టీడీపీకి ఎన్టీఆర్ భయం ఏంటా అనుకుంటున్నారా.. అవును మరి. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీఆరే కదా. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత పునాదుల మీద. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్, చంద్రబాబు ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై చెప్పారు.
అలాంటిది
ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో
చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే
ఆంధ్రా ఓటరు సహిస్తాడా..
టీడీపీ,
కాంగ్రెస్
దోస్తీని ఏపీ జనం ఎలా రిసీవ్
చేసుకుంటారు..
అన్న
బెంగ టీడీపీ నేతలకు పట్టుకుంది.
అందులోనూ
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో
టీడీపీ-
కాంగ్రెస్
దోస్తీని జనం నిర్ద్వంద్వంగా
తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అందులోనూ ఇటీవల ఇదే ఇష్యూపై బీజేపీ కూడా ప్రచారం తీవ్రం చేస్తోంది. మొన్నటికి మొన్న మోడీ కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టిడిపిని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ తో జతకట్టి ఎన్టీఆర్ను అవమానించిందన్నారు. ఏపీలో బీజేపీ నేతలు కూడా ఇప్పుడు దీనిపైనే ఫోకస్ పెడుతున్నారు.
మోడీ, బీజేపీ నేతల ప్రచారం చూసిన టీడీపీ నేతలకు ఇప్పుడు కౌంటర్లు ఆలోచించే పనిలో పడ్డారు. మోడీ అడ్డంగా మోసం చేసినందువల్లే కాంగ్రెస్ తో చేతులు కలిపామని వివరించాలని నిర్ణయించారు. అంతే కాదు.. అసలు ఎన్టీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టారన్న వాదనలో నిజం లేదని... ఆయన కేంద్రం ఆధిపత్యానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారని కొత్త డైలాగులు వినిపిస్తున్నారు.