ఒకపక్క దేశ ప్రధాని మన రాష్ట్రానికి వస్తుంటే ఆయన పాత దోస్తు సీఎం చంద్రబాబు మాత్రం ఆయన రానివ్వకుండా ఆపండి, నిలదీయండి అని అన్న మాటలు వెనుక చాలా అంతరార్థమే ఉందట. సాధారణంగా ఇలాంటి మాటలు చంద్రబాబు నోటి నుండి వినడం చాలా అరుదు. మోడీతో నాలుగేళ్ల పాటు దోస్తానా చేసిన బాబుకు.. ఏపీకి మోడీ ఏమీ చేయలేదన్న విషయం ఇప్పుడే అర్థమైనట్లుగా ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. దీనికి కారణం మోడీ రాకతో బాబు బెంబేలెట్టడమే.
జనవరి 6న చంద్రబాబు ఏపీ నడిబొడ్డు అయిన గుంటూరులో భారీ బహిరంగసభలో ప్రసంగించేందుకు ఆయన వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రసంగించనున్నారు అని పలువురు అంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా కేసీఆర్ నీ పొగిడి, బాబుని తిట్టే మోడీ ఈ సారి కూడా అలాగే వ్యవహరించబోతున్నారట. అలాగే నాలుగేళ్లు బీజేపీ రాష్ట్రానికి ఏమేమి చేసిందో ఈయన ప్రస్తావించబోతున్నారు అని బెజీపీ నాయకుల నుండి వాదన వినిపిస్తోంది.
నాలుగేళ్లు స్నేహం పేరుతో ఏమీ చేయకుండా కామ్ గా ఉన్న బాబు.. ఇప్పుడు మాత్రం మోడీ పై తీవ్ర విమర్శలు చేయటం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. నాలుగేళ్ల పొత్తు సందర్భంగా బాబు కేంద్రానికి అందించిన సహాయ సహకారాల వివరాల చిట్టా విప్పుతారని.. ప్రత్యేక హోదా విషయంలో బాబు రిక్వెస్ట్ లను బయట పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు.
విషయాలు గనుక ఆయన ప్రస్తావిస్తే బాబుకి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే ముందుజాగ్రత్తతో ఆయన పై ఇప్పటినుండే బాబు తెలివిగా వ్యతిరేకభావాన్ని జనాల మీద నూరి పోస్తున్నాడు. అయితే మంచి మాటకారిగా పేరున్న మోడీ బాబు గురించి ఎలాంటి గుట్టు విప్పబోతున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురచూస్తున్నారు.