జేసి దివాకర్ రెడ్డి మైక్ తీసుకున్నాడంటే చాలు విచిత్రంగా మాట్లాడతాడు కొన్ని సార్లు టీడీపీ కి తలనొప్పిగా మారిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పడు కూడా అటువంటి వ్యాఖ్యలే చేశాడు . కుల ప్రస్తావన తెచ్చి పార్టీకి తలనొప్పి తెస్తున్నాడు. రెడ్డీలు అందరూ వైఎస్సార్ సీపీ వెంటే నడుస్తారన్నది జరగక పోవచ్చు. బలిజలు పవన్ కల్యాణ్ వెంట ఉంటారనేది రాంగ్ ఓపీనియన్ అవుతుంది. రాజకీయంగా పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. రాయలసీమలో పరిస్థితి అదే విధంగా ఉంది. రెడ్డీల్లో ఎక్కువ మంది జగన్ కు - బలిజల్లో మెజార్టీ మంది పవన్ కల్యాణ్ కు ప్రస్తుతానికైతే మద్దతు పలుకుతున్నారు.

Image result for jc diwakar reddy

రెడ్డీల్లో తెలుగు దేశం పార్టీకి కూడా కొంత ఓటింగ్ ఉంది. జేసీ దివాకర్ రెడ్డి వంటి దశాబ్దాల కాంగ్రెస్ కు చెందినవారే టీడీపీలో ఉన్నారంటే కొంత ఓటు బ్యాంకు తెలుగుదేశం వైపు ఉంటుంది కదా. బలిజలు తెలుగు దేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంకుగా ఒకప్పుడు ఉండేవారు.. జనసేన రావడంతో కొంత ఓటు బ్యాంకు అటువైపు మళ్లింది. యూత్ అయితే జగన్ వైపే చూస్తున్నారు.తాజాగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. జగన్ మీద ఫీలింగ్ లేని రెడ్డీల్లోనూ ఆలోచన వచ్చే విధంగా పవన్ కల్యాణ్ ను తమ వాడిగా ఓన్ చేసుకోని బలిజలను రెచ్చగొట్టి మరీ టీడీపీకి దూరం చేసేలా ఆయన మాట్లాడారు.


ఆ మాటలు విని బలిజలు పూర్తిగా టీడీపీకి దూరం అయ్యేలా ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.  జగన్ పవన్ కల్యాణ్ కులం పేరుతో రాజకీయం చేస్తున్నారని జేసీ చెప్పుకొచ్చారు. ఈ మాటలకు తటస్థులు దూరం అవుతారని అనుకోవడం పొరపాటేనని తెలుగు దేశం వాళ్లు చెబుతున్నారు. తమది కమ్మోళ్ల పార్టీ కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కమ్మోళ్ల జనాభా మూడు నాలుగు శాతం మించి ఉండదు. అక్కడ ఐదుగురు కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా మరో కమ్మ వర్గానికి చెందిన వ్యక్తికే ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. నాలుగు శాతం జనాభా లేని చోటే కమ్మోళ్లకు అంత ప్రాధాన్యం దక్కుతుండడంపై గతంలో జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కమ్మోళ్ల రాజ్యమని తమదేమీ నడవడం లేదని వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: