ప్రపంచం అత్యాధునీకమైన టెక్నాలజీ రంగం వైపు ముందుకు వెళ్తుంది. అదే స్థాయిలో అన్యాయాలు, అక్రమాలు ఎన్నో దారుణాలు కూడా పెరిగిపోతు న్నాయి.  గత కొంత కాలంగా భారత దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది..చివరికి చిన్నారులపై కూడా అఘాయిత్యానికి పాల్పపడుతున్నారు.. దుర్మార్గులు.  అయితే సినిమాల ప్రభావమో లేక మొబైల్ ప్రభావమో తెలీదు కానీ అన్యంపున్యం తెలియని  పిల్లల మనస్సుల్లో విషం నిండుతోంది.

ఈ మద్య హైదరాబాద్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి స్మార్ట్ ఫోన్ లో పక్కనే ఉన్న హాస్టల్ అమ్మాయిలు స్నానం చేస్తున్న సమయంలో వీడియో షూట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.   తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే..భోపాల్ నగరంలో ఓ ప్రైవేట్ స్కూ‌ల్‌లో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల చిన్నారిరపై అదే క్లాస్ లో చదువుతున్న కుర్రాడు అత్యాచారం చేసి ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

స్కూల్‌ నుంచి వచ్చిన విద్యార్థికి రక్తస్రావం కావడంతో చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పాపను పరీక్షించిన వైద్యులు... అత్యాచారం జరిగిన విషయం చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. గురువారం ఉదయం స్కూల్ కి వెళ్లిన చిన్నారి..వెంట వచ్చిన ఆ బాలుడు చెట్ల పొదల్లోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిసింది.  అంతే కాదు ఆ కుర్రాడితో పాటు మరో గుర్తుతెలియని కుర్రాడు కూడా బాలికపై అత్యాచారం చేసినట్టు అనుమానిస్తున్నారు.  ఐపీసీ సెక్షన్ 376తో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... బాలిక మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: