ఎన్టీఆర్ మనవుడు దద్దుబాటి పురందేశ్వరి కొడుకు జగన్ పార్టీ లోకి రాబోతున్నాడని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి . అయితే ఇతను కూడా జూనియర్ ఎన్టీఆర్ మాదిరి  వాక్చాతుర్యం కల వాడైతే జగన్ పార్టీ కి ప్లస్ అని చెప్పొచ్చు . ఇప్పుడు తెలుగు నేల రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో ఎంట్రి ఇవ్వనున్న దగ్గుబాటి హితేశ్ కూడా వైసీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Image result for hitesh daggubati

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు - బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి - మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుల కుమారుడైన హితేశ్... లోకేశ్ మాదిరే ఎన్టీఆర్ కు మనవడే. అయితే ఎన్టీఆర్ మనవడిగా ఓ ఇమేజీ ఉన్న హితేశ్... ఇప్పుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో కాకుండా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ మనవలుగా నారా లోకేశ్ - దగ్గుబాటి హితేశ్ ల మధ్య బంధుత్వంతో పాటు మంచి స్నేహం కూడా ఉందట. అయినా కూడా హితేశ్ వైసీపీ వైపు చూస్తుండటం నిజంగానే ఆశ్చర్యమే.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని అధికారాన్ని చేజిక్కించుకున్న సమయంలో తన వెంట నడిచిన వెంకటేశ్వరరావును చంద్రబాబు ఆ తర్వాత పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో దగ్గుబాటి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన కాస్తంత సైలెంట్ గా ఉన్నా... ఆయన సతీమణి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఏపీలోఎదురీదుతోంది. ఈ నేపథ్యంలో తన తనయుడి రాజకీయ రంగ ప్రవేశానికి బీజేపీ పనికి రాదన్న భావనలో దగ్గుబాటి ఫ్యామిలీ ఉంది. అదే సమయంలో జగన్ తో కలిసి నడిచే విషయంలో హితేశ్ పెట్టిన ప్రతిపాదనకు పురందేశ్వరితో పాటు వెంకటేశ్వరరావు కూడా ఓకే చెప్పేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: