2014 ఎన్నికల్లో అనంత పురం నుంచి టీడీపీ కి అత్యధిక సీట్లు వచ్చాయి. ఎంపీ సీటు కూడా టీడీపీ ఖాతా లోకి పడింది. అయితే గడిచిన నాలుగేళ్లలో అనంత పురం లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని స్వయంగా అనంత పురం ఎంపీ జేసి చాలా సార్లు అభిప్రాయ పడ్డాడు. అయితే ఇప్పడూ మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది. 

anantapur: ex mla gurunath reddy quits telugu desam party

టీడీపీలో చేరి తప్పు చేశానంటున్నారు అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి. చంద్రబాబు పాలన బాగుందని తెలుగు దేశం పార్టీలో చేరితే.. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. ఆదివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తానన్నారు. గుర్నాథ్ రెడ్డితో పాటూ మరో ఐదుగురు కార్పొరేటర్లు కూడా ఆయనతో పాటూ టీడీపీకి గుడ్ బై చెప్పారు. 

Image result for gurunatha reddy

తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పిన గుర్నాథ్ రెడ్డి ఏ పార్టీలో చేరతారన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన తిరిగి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగియగానే తిరిగి పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై గుర్నాథ్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. అనంతపురంకు చెందిన గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగారు. వైసీపీ ఏర్పాటు తర్వాత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేశారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో అనంతపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి.. ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడారు. గతేడాది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: