ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో టీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరియు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసి ముందుండి నడిపించిన కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో పోటీ చేసి కేవలం 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలవడంతో ఆ పార్టీ పెద్దలు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Image result for congress

ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటమికి గల కారణాలు తెలుసుకోవడానికి కుంతియా హైదరాబాద్ చేరుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అయ్యి ఓటమికి అసలు కారణం మరియు ఈవీఎంల సమస్య వంటి విషయాలపై చర్చించారు. తాజాగా తెలంగాణలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సెక్రటరీ సలీమ్ అహ్మద్‌తో పాటు  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన అభ్యర్థులు పాల్గొన్నారు.

Related image

ఈ క్రమంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కానీ వెంటనే రిపేరు కార్యక్రమాలు చేపట్టడంతో ఆ పార్టీ క్యాడర్లో కొంత సంతోషం నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: