ఇటీవల తెలంగాణ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ సీఎం చంద్రబాబును ఏకిపారేశారు. అసలు దేశంలోనే చంద్రబాబు అంత డర్జీ పొలిటిషయన్ ఇంకొకరు లేరన్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ వంటివి లేవన్నారు. అంతే కాదు.. మోడీ సంకలో నాలుగేళ్లు ఉన్నది నిజం కాదా.. ఇప్పుడు రాహుల్ సంక ఎక్కింది నిజం కాదా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.



చంద్రబాబును తిడుతూ కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ అలా ముగిసిందో లేదో.. టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు కురిపించారు. ఓ సీఎం మాట్లాడే భాష ఇదేనా అంటూ ఈసడించారు. ఆ తర్వాతి రోజు చంద్రబాబు సైతం కేసీఆర్ తిట్లపై కామెంట్లు చేశారు. నోటికేది వస్తే అది మాట్లాడతారా అంటూ రెచ్చిపోయారు. ఇప్పుడు ఇదే ఇష్యూను వైసీపీ హైలెట్ చేస్తోంది.



కేసీఆర్ తనను తిట్టారని గింజుకుంటున్న చంద్రబాబుకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనలకు కేవలం కొద్దిరోజుల ముందు అనంతపురంలో జరిగిన ధర్మపోరాట సభలో జేసీ దివాకర్ రెడ్డి జగన్‌ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే అదే వేదికపై ఉండి చంద్రబాబు ముసిముసినవ్వులు నవ్విన సంగతి గుర్తు చేస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి విపక్ష నేత జగన్ ను, ఆయన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తిడుతుంటే చేష్టలుడిగి ఎందుకు మిన్నకుండిపోయారో చెప్పాలని వైసీపీ నేత బాలశౌరి డిమాండ్ చేశారు.

jc diwakar reddy on jagan కోసం చిత్ర ఫలితం


తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్టిన తిట్లను ఎవరూ సమర్థించరు. కాకపోతే.. కేసీఆర్ మాటతీరు అంతే అన్న సంగతి అందరికీ తెలుసు. ఇదేమీ కొత్త విషయం కాదు. కానీ రాజకీయాల్లో విలువలు పాటిస్తానని చెప్పుకునే చంద్రబాబు.. జేసీ తిట్లను ప్రోత్సహించడం ఆక్షేపణీయమే. తప్పు ఎవరిదైనా తప్పు అని చెప్పగలిగితేనే సంస్కారం ఉన్నట్టు.. మీరేమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి: