ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో వైసిపి పార్టీ హవా కొనసాగుతోంది. ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగబోతున్న క్రమంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రతి సర్వేలో వైసిపి పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.

Related image

ఈ క్రమంలో తాజాగా ఇటీవల భవిష్యత్ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న చాలా మంది యువకులు మరియు ఉత్సాహవంతులు వైసీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల బిజెపి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే దగ్గుబాటి పురందేశ్వరి మరియు ఆమె కొడుకు ఇద్దరూ కలిసి వైకాపా పార్టీలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినబడుతుంది.

Image result for ysrcp jagan padayatra

అంతేకాకుండా వైసిపి సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి తో కూడా ఈ విషయమై ఆమె చర్చించినట్లు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విధంగా వైసీపీ పార్టీ రాష్ట్రంలో హవా కొనసాగుతున్న క్రమంలో సినీరంగం నుండి కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తుంది.

Related image

త్వరలో జగన్ పాదయాత్ర ముగుస్తున్న క్రమంలో తర్వాత మొదలు పెట్టబోయే బస్సు యాత్ర లో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున జగన్ తో కలిసి బస్సు యాత్రలో పాల్గొంటున్నట్లు అటు రాజకీయ రంగంలోనూ ఇటు పొలిటికల్ రంగంలోనూ వార్తలు తెగ గుప్పుమంటున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: