ఎన్టీఆర్ బయో పిక్ విడుదల అవుతుండటం తో ఒక్క సారిగా ఎన్టీఆర్ వెన్నుపోటు ఘట్టం ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వస్తుంది.  నందమూరి బాలయ్య తండ్రిని పదవీభ్రష్టుడిని చేయడంలో కీలకపాత్ర పోషించాడని అనేకమంది చెబుతూ ఉంటారు. ఆ విషయాన్ని గట్టిగా చెప్పేవాళ్లలో బాలయ్య పెద్ద బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందుంటాడు. ఈయన ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ అయ్యాకా ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెబ్ లో వైరల్ గా మారాయి. రెండేళ్ల కిందట బాలయ్య తొలిసారి ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తానని ప్రకటించినప్పుడు దగ్గుబాటిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాయి చానళ్లు. ఆ సందర్భంలో దగ్గుబాటి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను పదవీభ్రష్టుడిని చేసే అంశం గురించి కూడా మాట్లాడాడు.

Image result for ntr bio pic

అసలు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తాడని తను అనుకోవడం లేదని అప్పట్లో ఆయన ప్రకటించాడు. ఎందుకలా అంటే.. ఎన్టీఆర్ ను పదవీభ్రష్టుడిని చేయడంలో బాలయ్య పాత్ర కూడా ఉందని, వైస్రాయ్ అంకానికి ముందుగా తన ఇంటికి ముగ్గురు వచ్చారని.. వాళ్లే చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ అని దగ్గుబాటి చెప్పాడు. ఎన్టీఆర్ ను దించేద్దాం అని వాళ్లే తనతో ప్రతిపాదించారని దగ్గుబాటి వివరించాడు.

Image result for daggubati venkateswara rao

చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి  బాలయ్యకు పార్టీ అధ్యక్ష పదవి హరికృష్ణ సెక్రటరీ, తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని వారు ప్లాన్ వేశారని దగ్గుబాటి వివరించారు. ఆ తర్వాత చంద్రబాబు హరి, బాలయ్యలను తరిమేసి అంతా తనే అయ్యాడని.. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్లలో తనూ ఒకరని దగ్గుబాటి వివరించాడు. తండ్రిని పదవీచ్యుతుడిని చేయడానికి అన్నతో, ఒక బావతో కలిసి మరో బావ ఇంటికి వెళ్లిన బాలయ్య ఇప్పుడు తండ్రి బయోపిక్ ను ప్రతిష్టాత్మకంగా తీస్తున్న నేపథ్యంలో.. అందులో వాస్తవాలు చూపకపోతే అది బయోపిక్ కాదని, వాస్తవాలు చూపితే విలన్లుగా ఎవరు నిలవాలో అందరికీ తెలుసని దగ్గుబాటి వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: