ప్రభాస్ గెస్ట్-హౌజ్ కేస్ అనేక మలుపులు తిరుగుతుంది. ఎప్పుడూ వివాదాల్లో లేని ప్రభాస్ తొలి సారి చాలా పెద్ద భూవివాదంలో ఇరుక్కున్నాడు. ఎలాగైనా తన గెస్ట్-హౌజ్ దక్కించుకోవాలని చూస్తున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. రాయదుర్గంలోని తన ఇంటిని రెవిన్యూ అధికారులు సీజ్ చేసారు. ఇది జరిగి కూడా 20 రోజులు అవుతుంది. అప్పట్నుంచి ఈ కేస్ కోర్టులో ఉంది. ఏ విషయం అయినా కూడా కోర్టు లోనే తేల్చుకుంటానంటున్నాడు ప్రభాస్.
అఅంతేకాదు.. దీనిపై పూర్తి వివరాలు కావాలంటూ అధికారులను కోర్టు నిలదీసింది. తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై ప్రభాస్ కోర్టులో పిటిషన్ వేయగా.. దానికి రెవెన్యూ అధికారులు కౌంటర్ దాఖలు చేసారు. ఇప్పుడు ఈ విషయం రాను రాను ఇంకా సీరియస్ అయిపోతుంది.
రెగ్యులైజేషన్ కోసం ప్రభాస్ పెట్టుకున్న పిటిషన్ ను ఎందుకు వెనక్కి పంపారు? దాన్ని ఎందుకు మీరు పరిశీలనలోకి తీసుకోలేదు? అంటూ అధికారులను కోర్టు ప్రశ్నించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 3 న కోర్టు ముందు ఉంచుతాం అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా చూపించి, తన గెస్ట్-హౌజ్ ఉన్న స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించినట్లు ప్రభాస్ తన పిటిషన్ లో తెలిపాడు. మరి ఇది ఎక్కడ ఆగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.