ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఏం కామెంట్ చేసినా అవి ఇట్టే వైరల్ అవుతున్నాయి.  పాజిటీవ్ అయితే ఒకే..ఏదైనా నెగిటీవ్ కామెంట్స్ చేస్తే మాత్రం ట్రోటింగ్ తో దుమ్ముదులుపుతున్నారు.  టాలీవుడ్ లో కమెడియన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ తర్వాత స్టార్ ప్రోడ్యూసర్ రేంజ్ కి ఎదిగారు.  ఇటీవల తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన పార్టీ తరుపు నుంచి ప్రచారం చేశారు.  ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని..అధికార పార్టీపై ప్రజలు విముఖత చూపిస్తున్నారని..కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని స్టేట్ మెంట్ ఇచ్చారు. 

అంతే కాదు కాంగ్రెస్ గెలువకుంటే..బ్లేడ్ తో తన గొంతు కోసుకుంటానని శపథం చేశారు.  ఇక తెలంగాణలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది..టీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచింది.  ఈ సందర్భంగా బండ్ల గణేష్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి..కొంత మంది బ్లేడ్ పట్టుకొని మరీ విమర్శలు గుప్పించారు.  ప్రస్తుతం ఏపిలో మరో సినీ నటుడు కూడా బండ్ల బాటలో నడుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.  ప్రస్తుతం ఏపిలో వైసీపీ అధినేత ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.  జగన్ కి పలువురు సినీ తారలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. 
Image result for PRUDVI JAGAN
ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే ఫృథ్వి ఈ మద్య వైసీపీ జండా పట్టుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ మద్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జనసేనపై విమర్శలు చేస్తూ వైసిపి తప్పకుండా అధికారంలోకి రానుందని గట్టిగా చెబుతున్నారు.  అంతే ఇప్పుడు సోషల్ మీడియాల్ ఫృథ్విపై రక రకాల కౌంటర్లు వేస్తునారు.  ఆ మద్య బండ్ల గణేష్ కూడా ఇలాగే మేకపోతు గాంభిర్యం ప్రదర్శించారు..చివరికి ఏమైంది..ఇప్పుడు ఫృథ్వి కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటాడని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: