ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో బీజేపీ నేతలు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవినీతి చేస్తున్నారని నరేంద్ర మోడీ పర్యటన అడ్డుకుంటామని తెలియజేసిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం ఆరంభించారు ఏపీ బీజేపీ నేతలు.

Image result for chandrababu

ఈ క్రమంలో కాకినాడలో చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ కొందరు తమ పార్టీ పతాకాలను చేబూని సి.ఎమ్.గోబ్యాక్ అని నినాదాలు చేశారు.వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పార్టీ అద్యక్షుడు మాలకొండయ్యను ముందుగానే గృహ నిర్భందం చేశారు.

Related image

కేంద్రం నుంచి వచ్చే నిదులను వాడుకుంటూ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని,దీనిపై తాము సి.ఎమ్.ను కలవడానికి అనుమతి ఇవ్వాలని పోలీసు అదికారులను బిజెపి నేతలు కోరారు. దానికి పోలీసులు అనుమతించలేదు.దాంతో వారు ఇలా న ఇరసన తెలిపారు.

Related image

ఇలాంటివి చేస్తే చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించడం విశేషం. నరేంద్ర మోడీ రాష్ట్రానికి మోసం చేశారని మీరు ఈ ప్రాంతంలో పుట్టి వారికి అండగా మద్దతు తెలిపితే రాబోయే రోజుల్లో బిజెపి నాయకులను రోడ్లమీద ఆంధ్ర ప్రజలు కొడతారని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: