‘మాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి’ అంటూ బహిరంగంగా భయపెడుతూ మహిళను హెచ్చరించారు. 


పై మాటలు అన్నవారు ఒక గల్లి రౌడీ కాదు సాక్షాత్తూ నలభయ్యేళ్ళ సుధీర్గ రాజకీయ అనుభవమున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబులోని రాయల సీమ ఫాక్షనిష్ట్ నిద్రలేచాడా? ఆయనకు అసలేమైంది? పూర్తిగా డిప్రెషన్లో పడిపోయారా? కాసేపు అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్ధంకాలేదు. తీరా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తన చూపుడు వేలు చూపుతూ ఒక మహిళా కార్పోరేటరును హెచ్చరిస్తున్నారని అర్ధమైంది. 

కాకినాడలో తన కాన్వాయ్‌ ను అడ్డుకున్న బీజేపీ నాయకులను చంద్రబాబు తీవ్రస్థాయిలో బెదిరించారు. “మహిళ” అని కూడా చూడకుండా బీజేపీ నాయకురాలికి ప్రజాక్షేత్రంలో వార్నింగ్‌ ఇచ్చారు. జన్మభూమి కార్యాక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం కాకినాడకు వచ్చిన చంద్రబాబును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మోదీ జిందాబాద్‌, చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు ముఖ్యమంత్రినన్న సంగతి మరిచిపోయి బెదిరింపులకు దిగారు.

లేనిపోని ప్రాబ్లమ్స్‌ తెచ్చి పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీరు ఫినిష్‌ అయి పోతారు. బయటకు వస్తే మిమ్మల్ని పబ్లిక్‌ వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి నీకు. వెళ్లమ్మా వెళ్లు అంటూ బీజేపీ మహిళా నేతను హెచ్చరించారు.
Chandrababu Naidu Warns BJP Woman Leader - Sakshi
గతంలో నాయీబ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తా అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అక్కడ ఉన్న జనం. సీఎం వ్యవహారశైలిని బీజేపీ నాయకులు తప్పుబట్టారు. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలి చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆయన గురించి తెలిసిన వారు మాత్రం చంద్రబాబు మారలేదని సరిపెట్టుకున్నారు. 


మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా బెదిరించడం సరికాదన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే బెదిరిస్తారా?  అంటూ మండిపడ్డారు. కాకినాడలో అడుగుపెట్టిన చంద్ర బాబు, జన్మభూమి కార్యక్రమ వేదికకు వెళ్లేందుకు బస్సులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో చంద్రబాబు పాలనను విమర్శిస్తూ కొందరు బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారు. చంద్రబాబు బస్సును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి వరదలై పారుతోందంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ తరహా ఆరోపణలను ఏమాత్రం పట్టించు కోకుండానే చంద్రబాబు గతంలో మామూలుగానే వెళ్లిపోయేవారు. 

అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తన ఓటమిని సర్వేలు తేల్చి పారేసిన వేళ, చంద్రబాబులో అంతరంగంలోని అసలు సిసలు రూపం బయటకు వచ్చేసింది. బస్సును నిలిపివేయ మన్న చంద్రబాబు బస్సు దిగారు. ఆ వెంటనే తనపైనా తన ప్రభుత్వ తీరుపైనా విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ కార్యకర్తలపై చంద్రబాబు ఇక రెచ్చిపోయారు. అయినా ఆందోళన కారులు వెనక్కు తగ్గకపోగా,  వారిలోని ఒక మహిళ చంద్రబాబు అవినీతి పాలన పై మరింత బిగ్గరగా, నినాదాలు చేశారు. అంతే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటకు తీశారు. “బయటకొస్తే వదిలి పెట్టరు పబ్లిక్. జాగ్రత్తగా ఉండు. ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని కొడతారు.. జాగ్రత్త. ఇలాగే చేస్తోంటే మీరు ఫినిష్ అయిపోతారు” అంటూ సదరు మహిళకు చేయి చూపిస్తూ చంద్రబాబు తనదైన రీతిలో ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: