తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరియు సినీ నటి విజయశాంతి విజయవాడ తమిళనాడు రాజకీయ నేత శశికళ ను కలిసినట్లు బెంగళూరు కారాగార అధికారులు శుక్రవారం తెలిపారు.  జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె శశికళను కలుసుకున్నారు. డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే నుంచి విడిపోయి ‘అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ’ని శశికళ నెలకొల్పారు.

Related image

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు కోరేందుకు విజయశాంతి వచ్చినట్లు సమాచారం. . తెలంగాణ సిఎం కెసిఆర్‌  ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై విజయశాంతి వద్ద శశికళ ఆరా తీశారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో రాణించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర కృషి చేస్తున్నారు.

Related image

ఈ నేపథ్యంలో దక్షిణాది రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల లో ఏక భావన తీసుకురావడానికి బిజెపి కూటమికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించినట్లు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

Image result for vijayshanthi

ఏది ఏమైనా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో తగిలిన దెబ్బ నుండి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్లాన్ వేసినట్లు ప్రస్తుత పరిస్థితుల బట్టి అర్థమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: