ఈనాడు అధిపతి రామోజీరావును హత్య చేసేందుకు గతంలో ఎన్టీఆర్ కుట్ర చేశారా.. అవునంటున్నారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌ రావు. మోజో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ విడుదలవుతున్న నేపథ్యంలో మోజో టీవీ ఈ ఇంటర్వ్యూ చేసింది.



ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ఒకసారి శ్రీశైలం వెళ్లానని.. ఆ సమయంలోనే తనకు ఈ కుట్ర గురించి తెలిసిందని నాదెండ్ల భాస్కర్‌రావు మోజో టీవీకి చెప్పారు. తాను వెళ్లిన సమయంలోనే ఎన్టీఆర్ కూడా శ్రీశైలం వెళ్లానని.. తనను ఓ స్వామీజి పిలిచారని ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.



తనను పిలిపించిన స్వామీజీ.. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ రామోజీని అంతం చేయబోతున్నారని.. ఈ విషయం తనకు తెలిసిందని నాదెండ్ల అంటున్నారు. ఎన్టీఆర్‌ తో చేతులు కలపమని ఆ స్వామీజీ తనకు సూచించారని.. తాను అందుకు తిరస్కరించానని నాదెండ్ల మోజో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.



ఆ స్వామీజీ తనను ప్రత్యేకంగా పిలిపించి తలుపులు వేసి మరీ ఈ రహస్యం చెప్పారంటున్నారు నాదెండ్ల. ఎన్టీఆర్ బయోపిక్‌లో తన పాత్రను వక్రీకరిస్తారని నాదెండ్ల అనుమానం వ్యక్తం చేశారు. తనను విలన్‌ గా చూపిస్తారని ఆయన అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: