ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించిన నేరానికి పసిబిడ్డ తల్లి అనైనా చూడకుండా జైల్లో పెట్టారు" బయటికి రండి అంతు చూస్తా? ఫినిష్ అయిపోతారు!" అనే విద్య విఙ్జానంలేని వాళ్ళు బజారు రౌడీలు, గుండాలు మాట్లాడే మాటలు ప్రయోగించి తను మరో చింతమనేని, జేసీ, బుద్దా వెంకన్న, బాబూ రాజేంద్ర ప్రసాద్ స్థాయికి నైతికంగా దిగజారారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి ధ్వజమెత్తారు.
కాకినాడలో బీజేపీ నేతలను, మహిళను ఆయన బెదిరించిన 24 గంటలు కాకుండానే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఇంటి మీద దాడి జరిగిందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రౌడీ గూండా రాజకీయాలు చేసేవారు కాలగర్భంలో కలిసిపోతారని, కలసిపోయారని కూడా అన్నారు. వారిపై దాడి చేసిన గూండాలను అరెస్ట్ చేసి, బీజేపీ నాయకుల కు సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల మీద దాడి చేసి, హత్యా యత్నం చేసిన మీ పార్టీ ఎంపి జేసీ సోదరుల అనుచరులను ఆదర్శంగా తీసుకున్నారా?
"ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే - అది చేసింది మీ కుటుంబ సభ్యులే! అన్న మీపార్టీ ఎమెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మీకు ఆదర్శమా?
భారత ప్రధాని నరేంద్ర మోదీని లోఫర్ అన్న మీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు మీకు ఆదర్శమా? అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్సీ ప్రకటన చేసిన 24 గంటలలోపే - కన్నా లక్ష్మినారాయణ మీద ఇంటి మీద దాడి జరిగిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుని మీద పోలీసుల సహకారంతో తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారని ఆరోపించారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "గుంటూరులో సాధారణ మైనారిటీలను ప్రశ్నించి నందుకు చిత్ర హింసలు పెట్టారుకదా! 40 ఏళ్ల అనుభవం నుంచి మీరు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? " నాయీ బ్రాహ్మణులు ఆదుకోమని వస్తే బెదిరించిన చరిత్ర మీదే కదా!
కేసీఆర్ మాట్లాడితే సైలెంట్ గా నటిస్తున్నారు అంటే, ఓటుకు నోటు కేసులో మీరు దొంగ అని తెలిపోయిందనేనా? ఋణమాఫీ అంటూ వాగ్ధానం చేసి రైతులకు చేయిచ్చిన చంద్రబాబు నైతికత డైలమా పడి రైతు ద్రోహిగా మిగిలిపోయారుకదా! .
జగన్ మీద హత్యాయత్నం జరిగితే ఎయిర్ పోర్టు మాది కాదు కేంద్రం చేతిలో ఉంది అన్నాడు. ఇప్పుడు ఆ కేసును ఎన్ఐఏకి హై-కోర్టు బదిలీ చేస్తే టీడీపీ నాయకులు భయపడి ఫ్రస్ట్రేషన్లో ప్రధాని మోడీని తిడుతున్నారు. అసలు మోడీకి కేసుకేమి సంబంధం?
అగ్రిగోల్డ్ కేసు కూడా సీబీఐకి ఇస్తారు అనగానే ఎందుకు భయపడుతున్నారు? అసలు సిబీఐకి రాష్ట్రంలో ‘నో ఎంట్రీ’ పెట్టారంటే మీ లోపాలు మీరు ఒప్పుకున్నట్లేకదా? అయేషా మీరా కేసు సీబీఐకి కోర్టు బదిలీ చేసిన సంఘట్టనకు మీ ప్రభుత్వం సిగ్గుపడాలి కదా?
భూముల కుంభకోణంపై 'హైకోర్టు పిల్' స్వీకరించిందంటే అందులో ప్రభుత్వ తప్పిదాలు ఉన్నట్లే కదా? మీ మరియు మీ అనుచరుల కేసులు విచారణకు రాకుండా ఉండటానికి హైకోర్టు అమరావతికి రావొద్దు అన్నారు కదా?
చంద్రబాబు దోచుకుని, దాచుకుంటే, ఆయనకు ఆయన అక్రమ ఆస్తులకు ప్రజలు రక్షణ వలయంగా ఉండాలా? 2014 లో బీజేపీతో కలిసే అధికారంలోకి వచ్చారు. 90 రోజుల్లో అధికారం పోతుంది కాబట్టి మీ దోపిడీ బయటకు వస్తుందని మీ భయం పట్టుకున్నది కదా? అమిత్షా, నరేంద్ర మోదీ వస్తున్నారంటేనే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే తప్పుడు నివేదిక ఇచ్చారు కదా?
ఆరిపోయే దీపానికి వెలుతురెక్కువ అన్న నానుడి చందంగా చంద్రబాబు తీరులోనే ఈ మద్య ప్రఘాఢమైన మార్పువచ్చింది ముఖంలో ఏవో నిరాశ నిస్పృహలు వెల్లువెత్తుతున్నాయి కదా? జనవరి 18న అమిత్ షా రాయలసీమ వస్తున్నారు! ఆయనను ఆపండి చూద్దాం! ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సింగపూర్ తరహా జైలు నిర్మించుకోండి 90 రోజుల తర్వాత మీ అడ్రస్ అక్కడే ఉంటుంది" అని ఎద్దేవా చేశారు.