నరేంద్ర మోడీ టీడీపీ అధినేత అయినా చంద్ర బాబు మీద విమర్శలు ఇంకా ఎక్కువ చేశాడు. ఈ సారి చంద్ర బాబు కొడుకు ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్‌ను రాజకీయాల్లో పైకి తీసుకు వచ్చేందుకు ఏపీకి నష్టం చేకూరుస్తున్నారని మోడీ ఆరోపించారు. కొడుకు కోసం (సన్ రైజ్) ఏపీకి సూర్యాస్తమయం వంటి పరిస్థితిని తీసుకు వస్తున్నారని చెప్పారు. కేవలం కొడుకు రాజకీయ ఎదుగుదల పైనే చంద్రబాబు దృష్టి సారించారని మోడీ ఆరోపించారు.

కొడుకు రాజకీయ ఎదుగుదులకు ఏపీని వదిలేశారు

ఇందుకోసం ఏపీలో భారీగా జరుగుతున్న అవినీతి, అక్రమాలు, పాలసీలను వేటినీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యం కొడుకు రాజకీయ భవిష్యత్తే అన్నారు. తన కొడుకు కోసం ఆలోచిస్తూ.. ఏపీలోని ఇతర పిల్లల గురించి ఆలోచించడం చంద్రబాబు వదిలేశారన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దివంగత ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. తెలుగుకు అసలైన గర్వకారణం ఎన్టీఆర్ అన్నారు.

Image result for narendra modi

వీరు (చంద్రబాబు) ఏపీని చీట్ చేయడం ఇదే మొదటిసారి కాదని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్‌ను కేవలం ఒక్కసారి కాదు... రెండుసార్లు చీట్ చేశారని, అలాంటి వారి నుంచి మనం ఏం ఆశించగలమని ప్రశ్నించారు. ఈ రోజు ఏపీలో అధికారంలో ఉన్నవారు (చంద్రబాబు) గతంలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు తెలుగు ప్రజలకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా ఉన్నారని చెప్పారు. అధికారం కోసం ఏపీ అభివృద్ధిని తాకట్టు పెడుతున్నారన్నారు. ఎన్టీఆర్ విలువలకు వారు (టీడీపీ) తిలోదకాలు ఇచ్చిందన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: