ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టి టీడీపి ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ పబ్బం గడుపుతుందని..ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టారు. మన సమస్యలు తీర్చే ప్రజానాయకుడు వచ్చాడన్న ఉత్సాహంతో ప్రజలు జగన్ కి నీరాజనాలు పలికారు.  తమ కష్టాలు తీర్చేందుకు రాజన్న మళ్లీ వచ్చాడని ఎంతో సంబరపడ్డారు.  తమ కష్టాలు జగన్ ముందు ఉంచుతూ..అధికార పార్టీ నిరంకుశత్వ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. 
Related image
ఇలా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తన పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్ మోహన్ ని పలురు సినీ నటులు, దర్శకులు కలిసి తమ మద్దతు తెలిపారు.  ఈ నేపథ్యంలో జగన్ వెంట ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారని ప్రముఖ సినీనటుడు పృథ్వి తెలిపారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి లక్షలాది మంది జగన్ తో కలిసి అడుగులో అడుగు వేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని..ప్రభుత్వ వైఫల్యమే కారణమని  అభిప్రాయపడ్డారు.
91 అడుగుల ఎత్తైన పైలాన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటును జగన్ తీరుస్తారన్న భరోసా ప్రజలకు కలిగిందని పేర్కొన్నారు. ఇచ్ఛాపురంలో ఈరోజు పృథ్వి మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి అనూహ్య స్పందన వచ్చిందని..ఎంత మంది అడ్డంకులు సృష్టించినా..ఆయన వెంట ప్రజలు ఉన్నారని..ప్రజా మద్దతు ఉందని ఫృథ్వి అన్నారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్‌ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: