జగన్ ఓ సాహసి, ఏకంగా 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన మొనగాడు. ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశంలోనే సరికొత్త రికార్డు స్రుష్టించారు. ఇక ఒక సంచలనం పూర్తి అయింది. మరో సంచలనానికి నాంది పలకాల్సి ఉంది. పాదయాత్ర సెంటిమెంట్ అనుకున్న లక్ష్యాన్ని అందిస్తుందని బలంగా నమ్ముతున్న వైసీపీ ఇచ్చాపురం పాదయాత్ర ముగింపునకు భారీ ఎత్తున తరలి వచ్చింది. 


గుండె చప్పుడు విన్నా :


జనం గుండె చప్పుడును తాను విన్నానని జగన్ ఉద్వేగంగా చెప్పారు. ఇచ్చాపురం వద్ద ఈ రోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, 14 నెలలుగా 3648 కిలోమీటర్లు తాను నడిచినా.. నడిపించింది మీరేనని చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నానని, ప్రతి కష్టాన్ని కళ్ళారా చూశానని జగన్ చెప్పారు. తాను అందరికీ భరోసా ఇస్తున్నానని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ కష్టాల కన్నీళ్లకు ముగింపు ఇద్దామని జగన్ ప్రకటించారు.


విజయస్తూపం ఆవిష్కరణ :


ఇదిలా ఉండగా, అంతకు ముందు  జగన్‌ ఇచ్చాపురం వద్ద  విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించారు.  ఆ మీదట బహిరంగ సభకు చేరుకున్నపుడు ఆయనకు  లక్షలాది మందితో జనం జేజేలు పలికారు.  జై జగన్‌ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: