ప్రజా సంకల్ప యాత్ర ముగింపు వేళ వెటరన్ యాక్టర్ భానుచందర్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. . జగన్ పార్టీ కండువా కప్పి భానుచందర్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాంటి నేత లేనే లేడని కొనియాడారు
ప్రజల కోసం తపన :
ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ ప్రజల కోసం తపించే వైఎస్ జగన్ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. జనంతో ఇంతగా కలిసిపోయే నాయకుడు స్ జగన్ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని పేర్కొన్నారు. 2019 నుంచి మరో 20 సంవత్సరాల పాటు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు.
కాగా కొన్నిరోజుల క్రితమే భానుచందర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గతేడాది డిసెంబర్లో వైఎస్ జగన్ను భానుచందర్ కలిశారు. ఆరోజే తాను పార్టీలో చేరే విషయంపై అపుడే చర్చించారు. మొత్తానికి సినిమా ప్రముఖులు వైసీపీలో చేరడంతో ఆ పార్టీ కార్యకర్తలకు మంచి జోష్ వచ్చింది.