నంద్యాల రాజకీయాలు ఇప్పడూ మరో సారి బాగా వేడెక్కాయి. కర్నూల్ లో గ్రూప్ రాజకీయాలతో టీడీపీ అట్టుడికి పోతుంది. మంత్రి అయినటువంటి అఖిల ప్రియ కు ఏవీ  సుబ్బారెడ్డి కి అసలు పడటం లేదు. ఈ రచ్చకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే... అఖిల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక నంద్యాలలో భూమా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి దాదాపుగా తిరుగుబాటు చేసినంత పనిచేశారు. అయితే చంద్రబాబు కాస్తంత వేగంగానే స్పందించి సుబ్బారెడ్డి అఖిలను పిలిచి సయోధ్య కుదిర్చారు. అయితే ఈ సయోధ్య బాబు కేబిన్ నుంచి బయటకు వచ్చేదాకా మాత్రమే పని చేసింది.

Image result for akhila priya

అమరావతి నుంచి సొంతూళ్లు చేరుకునేలోగానే మళ్లీ అఖిల సుబ్బారెడ్డి విడిపోయారు. ఇద్దరి మధ్య ఇప్పటికీ మాటలు లేవు. ఈ క్రమంలో గత వారం భూమా అఖిల ప్రియ అనుచరుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు జరిగాయి. అంతేకాకుండా అఖిల ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ తెలుగు తమ్ముడి పై పోలీసులు ఏకంగా పీడీ యాక్టు కింద కేసు పెట్టేశారు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న అఖిల... తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ ను వెనక్కు పంపేశారు. సివిల్ పోలీసుల భద్రత కూడా అవసరం లేదని ఘీంకరించిన అఖిల... జన్మభూమి కార్యక్రమాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లిపోతున్నారు. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన పోలీసు బాసులు పార్టీ నేతలు ఆమెకు సర్దిచెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.

Image result for akhila priya

బయటకు తాను టీడీపీని వీడేది లేదని చెబుతూనే... సీఎం కార్యక్రమాలకు వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని ఈ విషయాన్ని సీఎంకు ముందే చెప్పానని చెబుతున్న అఖిల... సైలెంట్ గానే తన భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల టీడీపీని వీడేది ఖాయమేనని. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ... ఆమె ఏ పార్టీలోకి వెళతారనే కొత్త చర్చకు ఇప్పుడు తెర లేసింది. వాస్తవంగా ఆళ్లగడ్డ నుంచి అఖిల ఎమ్మెల్యేగా ఎన్నికైంది వైసీపీ నుంచే. అయితే ఆ తర్వాత బాబు విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోయిన భూమా నాగిరెడ్డి అఖిలతో కలిసి టీడీపీలోకి జంపయ్యారు. ఆ తర్వాత ఆయన చనిపోవడం అఖిల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వెంటవెంటనే జరిగిపోయాయి.ఈ నేపథ్యంలో అఖిల తిరిగి వైసీపీలోకే చేరతారా?  లేదంటే... గతంలో తన తల్లిదండ్రులు ప్రజారాజ్యంలో చేరినట్టుగా అఖిల జనసేనలోకి చేరతారా? అన్న కోణంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: