యుద్ధం చంద్రబాబుతోనే కాదు.  చంద్రబాబుకు గుడ్డిగా మద్దతు ఇచ్చే ఎల్లో మీడియాతో కూడా చేయాల్సి ఉంటుందని విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
jagan says he has to face CBN and also Yellow media at a time కోసం చిత్ర ఫలితం
ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, తోడుగా రమ్మని కోరుతున్నాను. కారణం ఏమిటంటే, ఎన్నికల్లో జరుగబోయే ఈ యుద్ధం ఒక్క చంద్రబాబు నాయుడు వంటి - నారా రాక్షసుడితో మాత్రమే కాదు. ఇతనికి తోడుగా జనాల్ని తప్పుడు రాతలతో తప్పుదారిపట్తించే ఎల్లో మీడియా కూడా ఉంది. వ్యవస్థలను మేనేజ్‌ చేసే పరిస్థితులు ఉన్నాయి. రెండు పత్రికలు, ఈ పెద్ద మనిషికి తోడుగా ప్రధానంగా ఉండగా ఇంకా పెద్ద చిన్న చితక చానెళ్లు అనేకంతో  కూడా యుద్ధం చేస్తున్నాం. 
jagan says he has to face CBN and also Yellow media at a time కోసం చిత్ర ఫలితం
ఇవన్నీ కాక ఈ జిత్తుల మారి మాయావి చంద్రబాబు ఎలాంటి పొత్తులైనా పెట్టుకుంటాడు. ఈ పొత్తులకు ఒక సిద్ధాంతంగాని ఒక విధానం గాని ఉండవు. ఓట్ల లెక్కలు ప్రత్యర్ధికి పడే ఓట్లలో చీలిక తీసుకురావటం మాత్రమే. ఫ్రజలకు వారి ప్రయోజనాలకు స్థానం లేదు తను తన కుటుంబం తనం బందుగణం తన సామాజిక వర్గం బాగుంటే చాలు రాహ్స్త్రం బాగున్నట్లే. అందుకోసం ఈ పెద్దమనిషి చేయని అన్యాయం, మోసం, దగా అంటూ లేనే లేవు. మీరు (ప్రజలు) తోడుగా ఉంటే ఈ అన్యాయాలు, మోసాలన్నింటినీ జయిస్తాను. 
jagan says he has to face CBN and also Yellow media at a time కోసం చిత్ర ఫలితం
అందుకే నాకు తోడుగా ఉండి, ఆశీర్వదించమని ప్రతి అక్కా, చెల్లెమ్మ, అవ్వా,  తాత, సోదరుడు, స్నేహితుడికి పేరు పేరునా విన్నవించుకుంటున్నా. మూడు నెలల్లో మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెబుతున్నాను. అని జగన్మోహనరెడ్డి అన్నారు.

jagan says he has to face CBN and also Yellow media at a time కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: