టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఇటీవల దేశ ప్రధాని మోడీ పై మరియు ఆంధ్రరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రధాని మోడీ మోసం చేశారని మాట్లాడుతూ తన అనుభవంతో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందని పేర్కొన్నారు.

Image result for chandrababu

ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసినందుకు ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చానని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ లెక్కగట్టిన ప్రకారం ఎపికి 75వేల కోట్ల రూపాయలు రావాలని ఆయన అన్నారు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన మూడువేల కోట్లు ఇవ్వాలని ఆయన అన్నారు.

Related image

రైతు రుణ మాఫీ, పింఛన్లు ఇచ్చామని ఏపీకి రావాల్సిన లోటును కత్తిరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ సహకారం అందించలేదని ఆయన అన్నారు.

Image result for chandrababu

మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన యదా ప్రకారం చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రజలు మళ్లీ టిడిపిని ఆదరిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు.  



మరింత సమాచారం తెలుసుకోండి: