తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి ఓడిపోతుందని తాను చంద్రబాబుకు ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని తాను ముందే ఊహించానన్నారాయన. కాకపోతే అంత భారీ విజయం సాధిస్తాడని మాత్రం తాను ఊహించలేదన్నారు.



తెలంగాణ సెంటిమెంట్, రైతుబంధు వంటి అంశాలు కేసీఆర్ విజయానికి కారణమయ్యాయి అన్నారు జేసీ. చంద్రబాబును బూచిగా చూపించి కేసీఆర్ ఎన్నికల్లో గెలిచాడన్నారు. మహాకూటమి వస్తే మళ్లీ ఉమ్మడి ఏపీ వస్తుందని కూడా కేసీఆర్ ప్రజలను నమ్మించగలిగాడన్నారు.



చంద్రబాబును దెయ్యంగా, భూతంగా కేసీఆర్ చూపించాడన్నారు. ఇక్కడ చంద్రబాబు చిన్న చిన్న లడ్డూలు ప్రజలకు ఇస్తున్నాడని.. కానీ కేసీఆర్ రైతుబంధు ద్వారా ఒకేసారి వెంకన్నలడ్డూ కంటే పెద్దలడ్డులు ఇచ్చాడని జేసీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతోనే ఎన్నికల్లో గెలవాలని ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు భావిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Related image


తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బందులు వస్తాయని కూడా కొందరు సెటిలర్లు టీఆర్‌ఎస్‌ కు మద్దతు ఇచ్చారని జేసీ అభిప్రాయపడ్డారు. అంతా మహాకూటమి వస్తుందని ఊదరకొట్టారని.. తాను మాత్రం కేసీఆర్ విజయాన్ని ముందే ఊహించానని అన్నారు. తెలంగాణలో మహా కూటమి ఓడోపోబోతుందని తానే నేరుగా చంద్రబాబునే కలిసి ఎన్నికల ముందే చెప్పానని జేసీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: