ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో శాసనసభ ఎన్నికల వేళ తెలంగాణాలో ప్రవేసించి, ఆపై స్వంతంగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎదుర్కోలేక కాంగ్రేస్ రెండు చిన్న చితక పార్టీలతో కలసి ప్రజాకూటమి పెట్టి బొక్కా బోర్లా పడి, చివరకు స్వంత మేనకోడలిని ధారుణ ఓటమికి గురిచేసి అవమానభారంతో పలాయనం చిత్తగించారు.
తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసిన వెంటనే రానున్న రోజుల్లో, చంద్రబాబు నాయుడికి రిటన్ గిఫ్ట్ ఇస్తానని కల్వకుంట్లవారు ప్రకటించిన సంగతి తెలిసింది. కేసీఆర్ వ్యూహత్మకంగా రిటన్ గిఫ్ట్ చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు భారీ రిటన్-గిఫ్ట్ ను సిద్ధం చేస్తున్నారు.
ఇందుకోసం అన్ని వైపుల నుంచి రహదారులు నిర్మించుకుంటూ చంద్రబాబు నాయుడికి జీవితంలో మరపురానంత భారీగా రిటన్-గిఫ్ట్ ఇవ్వాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆలోచన అనేది సమాచారం.
ఇందులో భాగంగా:
ప్రతిఏటా పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడిపందాలకు తప్పకుండా తెలంగాణా నుంచి వెళ్లే మాజీమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను తొలుత ప్రయోగించనున్నారని సమాచారం. సంక్రాంతికి భీమవరం వెళ్లే తలసాని అక్కడున్న మావుళ్లమ్మను దర్శించుకుంటారు. కోడిపందాలలో పాల్గొంటారు. మూడు నాలుగు రోజులపాటు అక్కడే తన మిత్రుల తో ఉండి ఎంజాయ్ చేసి రావటం శ్రీనివాస యాదవ్ కు అలవాటు.
తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా జరిగేటప్పుడు కూడా తలసాని కోడి పందాలకు వెళ్లడం విశేషం. ఈ సారి ఈ కోడి పందాలు సంక్రాంతి పండుగ ను చంద్రబాబుకి కేసీఆర్ వాగ్ధానం చేసిన రిటన్-గిఫ్ట్ వ్యూహంలోకి అనుసందించాలనేదిగ భావిస్తు న్నారు. తలసాని భీమవరం వచ్చే ముందు విజయవాడలో భారీగా ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లోని యాదవ కులసంఘాల నాయకులతో తలసాని చెప్పారని అంటున్నారు. ఈ యాదవ కుల సంఘాలకు చెందిన వారితో తొలుత భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ లో తమ బలం - బలగం ఏ స్థాయిలో ఉందో చూపించినట్లుగా ఉంటుందనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.
ఇక తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు కోస్తా జిల్లాలలో చాలా పెద్దసంఖ్యలో మిత్రమండలి ఉంది. వీరిలో అన్నీ కులాలు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మరియు తమ వెలమలు ఉన్నారు. వీరితో కూడా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించి వారి వారి సామాజిక వర్గాలకు చేరువై చాపకింద నీరులా ఒక నెట్-వర్క్ ఏర్పరచుకొని రాజకీయాలకు కూడా వినియోగించుకొని చంద్రబాబు నాయుడికి భారీ విస్పోటనం కలిగించే రిటర్న్-గిఫ్ట్ గా యివ్వటమే కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.
ఇక నారా చంద్రబాబు నాయుడి స్వంత సామాజికవర్గంలో, తెలుగుదేశం పార్టీ పైనా, చంద్రబాబుపైనా ఆగ్రహంతో ఉన్నవారు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే పనిని తన సన్నిహితుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారన్నది కేసీఆర్ ఆలోచన అంటున్నారు. ఇదంతా భిన్న విభిన్న వ్యూహాలతో "తన శత్రువు - చంద్రబాబు" ని ముట్టడి చేయటమే అంటున్నారు.
అయితే ఈ వ్యూహరచనను అనుసరించి తొలిప్రయత్నంగా తలసాని శ్రీనివాస యాదవ్ ను ప్రయోగించి ద్వారా యాదవ కుల సాన్నిహిత్యం సాధించటం దానినుంచి వచ్చిన ఫలితాలని బట్టి ఇతర వ్యూహాలని కార్యక్రమాలని అమలు చేయాలని కేసీఆర్ ప్రణాళిక అని చెబుతున్నారు.
పై సమాచారం నిజమే అనటానికి తలసాని ఇప్పటికే యాదవ కులసంఘాలని కలిశారు. తలసాని ఆద్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి ఏపి టిడిపి ప్రభుత్వం అనుమతి నిరాకరించటం జరిగిపోయింది. ఇంకేం యాదవ సంఘాలకు ఈ విషయంలో ఎక్కడో మండేది ఖాయం. అంటే కేసీఆర్ తొలి అడుగు పడిపోయింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాత్రం భారీ రిటన్ గిఫ్ట్ ఖాయంగానే కనిపిస్తోంది.