ఇటీవల బెజవాడ దుర్గమ్మ ఆలయానికి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ భగవంతుని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ఏపీ సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు బాహుబలి సినిమా చూపిస్తున్నారని అన్నారు.

Image result for talasani

ఎపి ప్రజలు అబివృద్ది,సంక్షేమం కోరుకున్నారని, కాని చంద్రబాబు ప్రతిదానికి సినిమా చూపిస్తూ కద నడుపుతున్నారని ఆయన అన్నారు. ఎపిలో టిడిపి మళ్లీ గెలిచే అవకాశం లేదని ఆయన అబిప్రాయపడ్డారు.

Image result for chandrababu bjp

తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ముతో చంద్రబాబు సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. హైటెక్‌ సిటీలో ఒక్క భవనం నిర్మించి.. అంతా తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.

Image result for talasani chandrababu

ఇంకా ఆయన మాట్లాడుతూ ఏపీలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనని, కాపులకు రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని తలసాని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిని జైల్లో పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తలసాని అన్నారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: