ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జగన్ పై హత్యాయత్నం కేసు కొత్త మలుపు తిరుగుతోంది. తన అభిమాన నాయకుడైన జగన్‌కు సానుభూతి పెరిగి వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఆయనపై నిందితుడు శ్రీనివాస్ హత్యాయత్నం చేసినట్టు ఏపీ పోలీసులు ఇప్పటి వరకూ చెప్పారు. కానీ జగన్ పై హత్యాయత్నానికి మరో కొత్త కారణం వెలుగులోకి వస్తోంది.

Image result for attack on ys jagan


ఏపీ పోలీసుల నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను తమ అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐ ఏ పోలీసులు అతడిని విచారిస్తున్నారు. శ్రీనివాస్ నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసిందట.

Image result for attack on ys jagan

అమ్మాయిల్లో క్రేజ్ పెంచుకోవడం కోసమే శ్రీనివాస్ ఈ హత్యాయత్నం చేశాడా అన్న కోణంలోనూ ఎన్‌ఐఏ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం చేయాలనుకున్న విషయాన్ని శ్రీనివాస్ కొందరు అమ్మాయిలతో పంచుకున్నాడుత్వరలోనే సంచలనం సృష్టంచబోతున్నానని వారిని ఊరించాడు.

Image result for attack on ys jagan


ఇకపై తనను కలుసుకోవాలంటే అపాయిట్‌మెంట్ తీసుకుని రావలసి వస్తుందని కూడా వారికి చెప్పినట్టు పోలీసుల సమచారం. మరోవైపు శ్రీనివాస్ హత్యాయత్నానికి ముందు రాసిన లేఖలోని ఓ పేజీ మాయమైందట. దీనిపై శ్రీనివాస్ తరపు లాయర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పోలీసులపనే అని ఆరోపిస్తున్నారు. చూడాలి. ఈ కేసు ఇంకెన్నిమలుపులు తిరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: