వాస్తవాలకు అనతి దూరంలో ఉంటుందని ఊహించిన ప్రేక్షక జనావళికి వారి ఊహ నిజమేనని ఋజువు చేసింది ఎన్ టీఆర్ కథానాయకుడు - "నేను బయటివాళ్లకు చెప్పేటప్పుడు మా నాన్న మంచివాడని నేను మహా పవిత్రుడిననే చెపుతాను. మా మద్య విబేధాలు ప్రపంచానికి తెలిసినప్పటికి కూడా - మా బావతో కలసి ఆయనకు వెన్నుపోటు వేసిన మా కుటుంబం లోని వాడినే నేనైనప్పటికి కూడా!" కీలకపాత్రను పోషించిన నందమూరి బాలకృష్ణ ప్రవర్తన ద్వారా అర్ధమైన నీతి ఇది. ఈ సహజ లోక రీతి తెలిసిన వాళ్లే లోకులు సారీ ప్రజలు.
అంతే కాదు ఆయనను వెన్నుపోటేసి ఆయన మరణానికి కారణమైన వాళ్లే ఆయన జయంతి, వర్ధంతి, ఇతర జాతీయ పండగల రోజుల్లో ఆయన స్మృతి చిహ్నం పై పుష్పగుచ్చాలుంచి ప్రదక్షిణ లు చేసినా ప్రణామాలు చేసినా గత 22 యేళ్ళ నుంచి జనం కళ్ళతో చూస్తూ, మనసులో మండిపోతున్నారు. ఈ నాటకాల వేషాలు టిడిపికి సహజమని అందరికి తెలుసు. రాజకీయ పిల్లిమొగ్గలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు వేసే రాజకీయ కుప్పిగంతులు కూడా జనంలో ఎన్టీఆర్ కుటుంబం పట్ల ఏహ్యభావం పెంచాయి. ఇది ఎన్టీఆర్ పట్ల కాదు సుమా!
ఈ సినిమాని వేరే ఎవరైనా తీసి ఉంటే నందమూరి తారక రామారావుపై తెలుగువారికి ఉన్న అభిమానం పొంగి పొరలేది. ఆయన ఉన్నంతకాలం ఆయన్ని ద్వేషించిన ఆయన కుటుంబం నేడు ఆయన మహనీయుడు, మహానుభావుడు అని చెపితే ఎవరు గౌరవిస్తారు. ముఖ్యంగా టిడిపి, దానిని సమర్ధించే యల్లో మీడియా అని పేరుబడ్ద ఒక వర్గం మీడియా ప్రభావం కూడా అసహ్యత ఆజ్యం పోసింది. అదే సినిమా వసూళ్ళకు గండి కొట్టిందని ప్రజల అభిప్రాయంగా కనిపిస్తుంది.
బహుశ కొద్దినెలలలో జరగనున్న సాధారణ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీకి జరగనున్న పరాభవానికి దీన్ని నాందీ ప్రస్థావనగా చెప్పవచ్చు. అంతే కాదు సూచనగా చెప్పొచ్చు. దీనికి ముందే తెలంగాణాలో బాబు ప్రవేశాన్నే గర్హించిన జనాలతీర్పే ఒక శకునమని చెప్పవచ్చు. అందుకే ఎన్టీఆర్ మహానాయకుడు ఇంతకంటే ధారుణ పలితాలనివ్వచ్చని అంటున్నారు.
ఈ రెండుమూడు రోజులుగా కొన్ని ప్రముఖ చానల్స్ చూసేవారికి పూర్తిగా వార్తా కార్యక్రమాలు, చానల్స్ లో వేసే సినిమాలతో సహా ఒకే ఒక సామాజిక వర్గ కంపు కొడుతున్నాయని అంటు న్నారు ఈ విషయం కూడా సాధారణ ప్రజలు చర్చల్లో వస్తున్నాయి. నారావారిపల్లె లో జరిగే కార్యక్రమాలపై పెట్టిన శ్రద్ధ ఇతర సమాజంపై పెట్టకపోవటం చూస్తుంటే -— ఇక బహుశ వాళ్లకు ప్రజలు అక్కర్లెదేమోనని పిస్తుంది. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం, వారికి భజన ఇదేనా! ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర! పెద్ద ప్రశ్న.
రోజంతా చంద్రబాబును చూపిస్తుంటే జనంలో ఆయనపట్ల, ఆయన ఉపన్యాసాలపట్ల ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేఖతను మీడియా గమనిస్తే ఇప్పటికైనా మీడియా ఏవరికైతే మేలు చేయాలను కుంటుందో వారికి మంచి జరుగుతుంది. లేకపోతే వారికి జరిగేది ముమూర్తులా హాని మాత్రమే. ప్రజలు ఈ దెబ్బతో చంద్రబాబును వెలివేస్తారేమో? అన్న అభిప్రాయం దేశం లోపల దేశం బయట నుంచీ వినిపిస్తూనే ఉంది. మీడియా మరియు చంద్రబాబు వీళ్ళిద్దరే దీనికి రాజకీయ కారణమని ఘంటాపథంగా చెప్పొచ్చు. వీటికి తోడు రక్తం, బ్రీడ్ అంటూ మాట్లాడే బాలకృష్ణ ప్రధానంగా వ్యక్తిగత కారణమయ్యారు.
ఈ రోజు ఒక సామాజిక కార్య క్రమానికి వెళితే అక్కడ హాజరైన సభ్యులు మనం టివీలను కొనుకున్నది ఈ మొహాలను చూడటానికేనా? అంటున్నారు కూడా! దీన్నిబట్టి రానున్న ఎన్నికలు "అవినీతి పరుణ్ణైనా, అసమర్ధుణ్ణైనా గెలిపిస్తారేమో గాని టిడిపి ని పనిగట్తుకొని గెలవనివ్వరు" అని అంటు న్నారు. దేశ వ్యాప్తంగా మోడీ వర్సెస్ ఆల్ అయితే రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు వర్సెస్ పీపుల్ ఆల్ అంటున్నారు. అయితే ఇక్కడ మోడీకి గెలిసే అవకాశాలు ఉన్నాయేమో? గాని టిడిపికి మాత్రం లేవంటున్నారు.