ఇటీవల తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వైసిపి అధినేత జగన్ మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు జెసి బ్రదర్స్ చంద్రబాబుతో భేటీ అయిన సమావేశం మరోపక్క ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
ఏపి సియం చంద్రబాబుతో ఎంపి జెసి దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి ఉండవల్లిలో సియం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. తమ కుమారులకు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి సియంతో జేసి బ్రదర్స్ చర్చించనున్నట్లు తెలుస్తుంది.
మరోపక్క ఏపీలో ఎన్నికలు వస్తున్న క్రమంలో చాలా మంది నేతలు ఇప్పటికే టికెట్లపై అధికార పార్టీకి చెందిన నేతల ఆశలు పెట్టుకున్న క్రమంలో తాజాగా అధినేత చంద్రబాబుతో ఈ ఇద్దరు నేతలు భేటీ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
గత కొంతకాలంగా అనంతపురం జిల్లాలో జే సి బ్రదర్స్ హవా కొనసాగింది...త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలు తమ వారసులను పొలిటికల్ బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జెసి బ్రదర్స్ మాత్రమే గాక చాలా మంది ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు వారి వారసులను రానున్న ఎన్నికల్లో పోటీకి దింపే యోచనలో ఉన్నట్లు ఏపీలో చూస్తున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది.