ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కేసీఆర్ తో కలిసి వైఎస్ జగన్మోహనరెడ్డి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలని ముంచివేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు సృష్టించిన సరికొత్త ఆయుధమే టీడీపీ ప్రయోగించే "సెంటిమెంట్" (నమ్మకం కలిగించే ఒక భావన) తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అమలు చేసిన అదే అస్త్రాన్ని ఏపీలో టీడీపీ అమలు చేయబోతోంది.
భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రేస్ పార్టీలకు చోటులేని
ప్రాంతీయ పార్టీల రాజకీయ సమాఖ్యే "ఫెడరల్ ఫ్రంట్" దీని ఏర్పాటులో భాగంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో టీఆర్ఎస్
కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు హైద్రాబాద్ లోని జగన్మోహనరెడ్డి నివాసానికి
వచ్చి కలసి సమావేశమయ్యారు.
ఇలాంటి సమావేశాలే చంద్రబాబు గతంలో మహాకూటమి పేరుతో బిజెపీని మాత్రమే ప్రక్కనబెట్టి కాంగ్రెస్ తో అన్నీ పార్టీల సామాఖ్య ఏర్పాటులో చెన్నై, డిల్లీ, కోల్కత్తా, బంగళూరు ఇలా పర్యటించి అందరి సహకారం కోసం ప్రయత్నించారని ఆ విషేషాలను టిడిపి మద్దతు మీడియా కోటానుకోట్ల స్వరాలతో గొంతెత్తి చెప్పింది. టిడిపి నాయకుళు దీన్ని తమ నాయకుడు చంద్రబాబు గారి అపర చాణక్యంగా చెప్పారు. పచ్చత్రికలు పచ్చ చానళ్ళు అంతర్జాలంలో "మన" వాళ్ళంతా వెల్లువెత్తుతూ వార్తా ప్రభంజనమే సృష్టించారు.
మరిప్పుడు కేసీఆర్ తరపున ఫెడరల్ ఫ్రంట్ కోసం వైసిపి అధ్యక్షుణ్ణి కలవగానే అదేదో నేరం లాగా - ప్రంటులు కట్తటం తమ జన్మహక్కు మాత్రమే అన్నట్లు మొత్తం టీడీపీ కంపించిపోతూ "సెంటిమెంట్" ఆయుధాన్ని ప్రయోగించటానికి ముందు గగ్గోలు పెట్టటం ఎందుకు. "సెంటిమెంట్" ఆయుధం తోనే టీఆర్ఎస్ తెలంగాణలో తమ పార్టీని కాపాడుకొంది చంద్రబాబు దుష్టపన్నాగం నుండి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో "ప్రజా కూటమి" విజయం సాధిస్తే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉభయ రాష్ట్రాల మీద రాజకీయ అధికారం చలాయిస్తారని కేసీఆర్ ప్రచారం చేశారు. ఈ ప్రచారం టీఆర్ఎస్ కు మరింత కలిసి వచ్చిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో లేకపోలేదు. ఇదే తరహా సెంటిమెంట్ ఆయుధాన్ని టీడీపీ ప్రయోగగింప జూస్తుంది. ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిని అడ్డుపెట్టుకొని కేసీఆర్ పెత్తనం చేయనున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రజల గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ గుర్తు చేస్తోంది. అంతేకాదు ఏపీకి అభివృద్ధికి అడుగడుగునా టీఆర్ఎస్ అడ్డుపడుతోందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏపీకి నష్టం కల్గించే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ఎంపీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 2017 జూలై మాసంలో సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేసిన వివరాలను నేడు టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రప్రజల గురించి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసుల మాదిరిగానే, ఏపీలో పుట్టినవాళ్లు కూడ వారి వారసులేనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఏపీలో తయారైన బిర్యానీని పేడ బిర్యానీ, రికార్డింగ్-డ్యాన్స్ ఏపీ ప్రజల సంస్కృతి అంటూ కేసీఆర్ చేసిన విమర్శల ను మంత్రి దేవినేని గుర్తు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంస్థ లు, ఆస్తుల పంపకంపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికైనా హైద్రాబాద్ లో కిరాయిదారులేనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడ ప్రస్తావిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ ఎప్పుడు ఏరకంగా మాట్లాడారనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ తరహా లోనే ఏపీలో కూడ టీడీపీ నేతలు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ తో జగన్ చేతులు కలుపుతున్నారని టీడీపీ ప్రచారాన్ని ప్రారంభించింది.
దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశకత్వంలోనే జగన్మోహనరెడ్డి, కేసీఆర్ ఫ్రంట్ పేరుతో ఏపీ ఎన్నికల్లో కలసి పనిచేయనున్నారని టీడీపీ చెబుతోంది. కొంతకాలంగా చంద్రబాబు చెబుతున్నట్టుగానే వైసీపీ, టీఆర్ఎస్లు జత కట్టే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జగన్ను అడ్డు పెట్టుకొని కేసీఆర్ ఏపీపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కారణం టిడిపి అధినేత వ్యవహార శైలి పై విశ్వాసం లేకనే నాడు టిఆరెస్ అధినేత కేసీఆర్ మహా కూటమిలో చేరలేదని అందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చెసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ చంద్రబాబు కూటమి ప్రయోగానికి "చీ కొట్టిన" తరవాతే బాబు తెలంగాణాలో రాజకీయ బ్రతుకుదెరువు కోసం అత్యన్య హీనంగా తెలుగువారి ఆత్మాభిమాన చిహ్నమైన టిడిపిని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధి పాదాల చెంత పెట్టినట్లు ప్రజలు భావించారు.
దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంటును టిడిపి నాయకులు తమ స్వార్ధం కోసం దుష్ట కాంగ్రెస్ కే బలిచేసినట్లు భావిస్తున్నారు. అయినా హైదరాబాద్ లో గాని తెలంగాణాలో కాని ఏపి ప్రజలు ఎక్కడా ఈ నాలుగున్నరేళ్ళు ఒక్క సారంటే ఒక్కసారి కూడా అవమానాలకు ఇబ్బందులకు గురికాలేదని ఢంకా బజాయించి చెపుతున్నారు.
మిగిలిన విషయాలేమైనా ఉంటే అవన్నీ ఇరుగు పొరుగుతో మిత్రులతో ప్రతిపక్షంతో చంద్రబాబు నాయుడి కుటిల ప్రవర్తన వలననే ఏర్పడ్డాయని ఏపి ప్రజలే నిర్ద్వంధంగా తమ అభిప్రాయా లు వెలిబుచ్చుతున్నారు. ఎన్నికల్లో టిడిపి దాని స్వంత మీడియా పూర్తిగా దిగజారి తెలుగు ప్రజల అత్యంతంగా విశ్వసించే ఆంధ్యా ఆక్టోపస్ లగడపాటి ఒపీనియం పోల్ ను కూడా మానిపులేట్ చేయించి ప్రజా కూటమి ఘనవిజయం పొందుతుందని చెప్పించటం జరిగింది. అదెంత ఆత్మ ద్రోహం అనె విషయాన్ని గుర్తించిన తెలంగాణా ప్రజలు వెనక ముందు చూడ కుండా "చంద్రబాబు చెరలో తెలంగాణా అధికారం" చిక్కుకో కుండా జాగ్రత్త పడ్దారు. చంద్రబాబు తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోకపోతే కాంగ్రెస్ చాలా మెరుగైన సంఖ్యలో సీట్లు గౌరవప్రధంగా పొంది ఉండేది అనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు టిడిపి నేతలు ఎన్ని సెంటిమెంట్ ఆయుధాలు ప్రయోగించినా వారి మీడియా ఎంతగా ప్రచారం చేసినా అది అక్కడ పనిచేయదని దానికి కారణం నాలుగున్న రేళ్ళు టిడిపి దాని నాయకులు వేసిన రాజకీయ పిల్లిమొగ్గలు కుప్పిగంతులు యూ-టర్న్ లే ప్రధాన కారణం అంటున్నారు. అంతే కాదు తెలంగానా ప్రజలకు గాని కేసీఆర్ బృందానికి గాని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంటే ఎలాంటి విభేధం లేదని ఈ నాలుగైదేళ్ళలో ఋజువు ఔతూవస్తుంది. అందుకే టిడిపి ప్రయోగించే ఆయుధం ఇప్పటికే చేతనత్వం కోల్పోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అన్నింటిని మించి ఏపి రాజధాని నిర్మాణం ప్రజలకు కాకుండా ఒక సామాజిక వర్గం కోసమేనని, ఇక్కడ కాంట్రాక్టులు, వ్యాపారాలు, పరిశ్రమలు, సినిమారంగం, ఎంటర్టెయిన్మెంట్ విభాగం, పర్యాటకం, మీడియా రంగం మొదలైన వాటిలో ఇతర సామాజికవర్గాలవారికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండట్లేదని, అధికారం, పెత్తనం పాలన అంతా ఒకే ఒక సామాజిక వర్గ ఆధిపత్యంలో నిర్వహించ బడటం ఇక్కడి ప్రజలకు ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని అంటున్నారు.
అందుకే చంద్రబాబు ఆయన సామాజిక వర్గ నాయకత్వం టిడిపి నేతలు ఏ సెంటిమెంట్ రగిల్చినా అవి పనిచేయవని ఇప్పటికే ప్రజలు టిడిపి వ్యతిరేక్ష పక్షానికే ఓట్లేయటానికి నిరెక్షిస్తున్నా రని పలుసర్వేలు ఘంటాపథంగా చెపుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు బాబు ఏ ప్రయోగం చేసినా ప్రజల ముందు పారదని అంటున్నారు. దానికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బాగున్నాకుడా చూడటానికి జనం ముఖం చాటేయటం వసూళ్ళ వైఫల్యానికి కారణమని అంటున్నారు. చంద్రబాబు ఎంత తెలివైనవారైనా అనేక శాపాలతో, ముఖ్యంగా ఎన్టీఆర్ ఆత్మఘోష వలన ఆయన ఇక ఏం చేసినా వైఫల్యం తప్ప, ప్రజలు స్వీకరించరంటున్నారు.