ఏపిలో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచే సంబరాలు మిన్నంటుతాయి.  ఇక గ్రామాల్లో అయితే కోళ్ల పందాలు, పేకట జోరు కొనసాగుతుంది.  మరికొన్ని చోట్ల యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తారంటూ ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సమీపంలోని నడవపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఓ గెస్ట్ హౌస్ లో అశ్లీల నృత్యాలు జరుగగా, అక్కడ జరిగిన గొడవకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Image result for అశ్లీల నృత్యాలు
స్థానిక టీడీపీ నేతకు చెందిన గెస్ట్ హౌజ్ లో ఇద్దరు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. కాగా.. ఈ విందులో పాల్గొన్న కొందరు యువకులు పీకలదాకా మద్యం తాగి.. గొడవ చేశారు. అమ్మాయిలను కిరాయికి తెచ్చిన మధ్యవర్తికి, చూసేందుకు వచ్చిన మరో వ్యక్తికి మధ్య గొడవైంది. మద్యం సేవించి అడ్డుపడ్డా డంటూ అతడిని బండబూతులు తిట్టారు.  అంతే కాదు కొద్ది సేపటి తర్వాత వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో.. మధ్యవర్తిని యువకులు చితకబాదారు.
Image result for అశ్లీల నృత్యాలు
దీంతో  బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్యాన్స్‌ నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి నిందితుడిని స్టేషన్‌ నుంచి తీసుకుపోయారు. అయితే రాజకీయ వత్తిడికి తలొగ్గిన పోలీసులు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.  సదరు నింధితుడి  గెస్ట్‌హౌస్‌లో నిత్యం ఇలాంటి అశ్లీల నృత్యాలు, పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: