వైసీపీ అధినేత జగన్ ఇటీవల ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ సామాన్య ప్రజలలో ఎక్కువగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పాదయాత్ర చేసిన జగన్ తాజాగా తన కూతురు లండన్ లో చదువుకుంటున్న నేపథ్యంలో ఆమెను చూడటానికి కుటుంబ సమేతంగా హైదరాబాదు నుండి బయలుదేరారు.
దాదాపు ఐదు రోజుల పాటు లండన్లోనే ఆయన గడపనున్నారు. పర్యటన ముగించుకుని ఈ నెల 22వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. జగన్ కుమార్తె వర్ష లండన్లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆమె విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్నికల ముందు పాదయాత్ర ముగించుకుని మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్తో భేటీ జగన్ లండన్ వెళ్తున్న నేపథ్యంలో ఈ పర్యటన పై చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరోపక్క సీనియర్ రాజకీయ నేతలు జగన్ కేటీఆర్ తో భేటీ అయి తన రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా విషయంలో మంచి క్లారిటీతో పరిణితి చెందిన రాజకీయ నేతగా చక్కగా వ్యవహరిస్తున్నారని అధికారంలోకి రాకముందు ఎన్నికల జరగక ముందు జగన్ ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో తెలివైన రాజకీయ అడుగులు వేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.