ఎన్నికలు వస్తున్న క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్ర రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారూ. ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూ మరోపక్క ప్రత్యర్థి పార్టీ లకు దిక్కుతోచని విధంగా చుక్కలు చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల చంద్రబాబు జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూషన్ (ఎల్ఆర్ఐ) కు శంకుస్ధాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతిలో విద్యా సంస్థను ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు.
ఎక్స్ఎల్ఆర్ఐకు 50 ఎకరాలు ఇచ్చామని రూ.250 కోట్లతో క్యాంపస్ నిర్మాణం చేపడతారని తెలిపారు. ఎక్స్ఎల్ఆర్ఐ దేశంలోనే అత్యున్నత మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తోందని, ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇక్కడ చదువుకునే వీలుకలుగుతుందన్నారు. అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని, రైతుల పిల్లలు బాగా చదువుకోవాలని చంద్రబాబు సూచించారు.
రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఏపీ ప్రజలకు సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చాలామంది విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆలోచిస్తున్నారని వారికి రానున్న ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని సూచించారు .