టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఒక పక్క రాష్ట్ర ప్రజలతో సమావేశమవుతూ మరోపక్క ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు తనదైన శైలిలో తన పాలనను ఎటువంటి అభివృద్ధి జరిగింది వంటి విషయాలను జన్మభూమి కార్యక్రమాలలో తెలియజేస్తున్నారు.
విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరగడానికి గల కారణం ప్రజల సహకారం మరియు నా అనుభవం అని ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వారి చేస్తున్న వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని పేర్కొన్నారు.
రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంటే అసూయ పడుతున్నారు సీఎం చంద్రబాబు అన్నారు. ఏమీ లేకపోయినా కోడి కత్తి కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించిందని మండిపడ్డారు. కోడి కత్తి కేసులో బెయిల్ కూడా రాకుండా కేసులు నమోదు చేశామన్నారు.
జగన్ ఫిర్యాదు చేయకపోయినా సీరియస్గా దర్యాప్తు చేశామని చెప్పారు. రాష్ట్ర అధికారాలపై కేంద్రం జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. దేశ వ్యవస్థలపై జగన్కు నమ్మకం లేకుంటే ఏ దేశంతో విచారణ కోరతారని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ విసిరారు.